2024 సార్వత్రిక ఎన్నికలలో ఇటు ఏపీతో అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్రంలోని మోదీ సర్కార్ ఏర్పాటులో కూడా కూటమి తరఫున గెలుపొందిన ఎంపీలు కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని మహాయుతి కూటమి గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే అదే ఊపుతో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనాలని సీఎం చంద్రబాబుకు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. దేశంలోని సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు చంద్రబాబు. అంతే కాకుండా అత్యంత అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కూడా ఆయనే. దీంతో, చంద్రబాబు సేవలను వినియోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ సారి ఆప్ ను ఎలాగైనా ఓడించాలని బీజేపీ పెద్దలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఫిబ్రవరి 1వ హస్తినలో తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు.
మరి, ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ సీఎం పవన్ కూడా వెళతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు లేదని కేజ్రీవాల్ ప్రకటించారు.
This post was last modified on January 28, 2025 7:29 pm
డివైడ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాలు థియేటర్లలో బలంగా నిలబడ్డం అంటే చిన్న విషయం కాదు. చెన్నై లవ్ స్టోరీ…
ఒకప్పుడు యుఎస్లో తెలుగు సినిమాలు విడుదల కావడాన్నే గొప్పగా భావించేవాళ్లం. అలాంటిది అది తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్గా తయారైంది. మన…
మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…
టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…