2024 సార్వత్రిక ఎన్నికలలో ఇటు ఏపీతో అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్రంలోని మోదీ సర్కార్ ఏర్పాటులో కూడా కూటమి తరఫున గెలుపొందిన ఎంపీలు కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని మహాయుతి కూటమి గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే అదే ఊపుతో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనాలని సీఎం చంద్రబాబుకు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. దేశంలోని సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు చంద్రబాబు. అంతే కాకుండా అత్యంత అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కూడా ఆయనే. దీంతో, చంద్రబాబు సేవలను వినియోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ సారి ఆప్ ను ఎలాగైనా ఓడించాలని బీజేపీ పెద్దలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఫిబ్రవరి 1వ హస్తినలో తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు.
మరి, ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ సీఎం పవన్ కూడా వెళతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు లేదని కేజ్రీవాల్ ప్రకటించారు.
This post was last modified on January 28, 2025 7:29 pm
మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…
ఏదైనా పెళ్లో.. మరో ఫంక్షనో.. భార్యా భర్తలు ఇరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. సహజంగా దంపతుల్లో ఉత్సాహం ఉంటుంది. భర్త ముందుగానే…
యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…
నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…