తెలంగాణలోని ప్రొద్దుటూరులో ‘ఎక్స్ పీరియం ఎకో పార్క్’ ను సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి కలిసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవిల మధ్య ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ప్రతి సందర్భంలో చిరంజీవికి రేవంత్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత సభలో కూడా చిరును ప్రస్తావించారు రేవంత్. ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి కూడా రేవంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారని, అయినప్పటికీ ఈ ఎకో పార్క్ ఓపెనింగ్కు రావడం సంతోషంగా ఉందని కొనియాడారు.
ఇటువంటి పార్కులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహం అందించడం అభినందనీయమని, వీటి వల్ల ఎంతో మందికి ఉపాధి, రాష్ట్రానికి టూరిజం పెరుగుతుందని అన్నారు. ఈ తరహా పార్కులకు ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి వన్నె తెచ్చే ల్యాండ్ మార్క్ పార్క్ అవుతందని అన్నారు.
హైదరాబాద్ పరిధిలో అంతర్జాతీయ స్థాయిలోని మొక్కలు లభించడం, అద్భుతమైన కళాఖండాలు ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఈ పార్క్ ఏర్పాటు చేసిన రామ్దేవ్ ఒక కళాకారుడని, పాతికేళ్లుగా పరిశోధనలు చేసి, దేశవిదేశాల నుంచి కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు, శిలలు తెచ్చారని అన్నారు. ఇక్కడ తొలి సినిమా షూటింగ్ అవకాశం తనకే ఇస్తానని చెప్పారని, అయితే, ఈ ఎండలో తాను డ్యాన్స్ చేయలేనేమోనని సెటైర్లు వేశారు. వచ్చే వింటర్ లో తప్పకుండా ఇక్కడ షూటింగ్ చేస్తానని అన్నారు.
ఒకప్పుడు మొక్కలకు వేలు, లక్షలు చెప్పేవారని, ఇప్పుడు మాత్రం కోట్లలో చెబుతున్నారని చిరు చెప్పారు. అయితే, తన సంపాదన ఇప్పుడు అంతంత మాత్రమేనని, వాటిని కొనలేనేమోనని రాం దేవ్తో చెబుతుంటానని చిరు సెటైర్లు వేశారు. అయితే, ఒకసారి వచ్చి ఆ మొక్కలు చూస్తే టెంప్ట్ అవుతారని రాం దేవ్ చెబుతుంటారని చిరు అన్నారు.
This post was last modified on January 28, 2025 7:00 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…