తెలంగాణలోని ప్రొద్దుటూరులో ‘ఎక్స్ పీరియం ఎకో పార్క్’ ను సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి కలిసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవిల మధ్య ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ప్రతి సందర్భంలో చిరంజీవికి రేవంత్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత సభలో కూడా చిరును ప్రస్తావించారు రేవంత్. ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి కూడా రేవంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారని, అయినప్పటికీ ఈ ఎకో పార్క్ ఓపెనింగ్కు రావడం సంతోషంగా ఉందని కొనియాడారు.
ఇటువంటి పార్కులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహం అందించడం అభినందనీయమని, వీటి వల్ల ఎంతో మందికి ఉపాధి, రాష్ట్రానికి టూరిజం పెరుగుతుందని అన్నారు. ఈ తరహా పార్కులకు ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి వన్నె తెచ్చే ల్యాండ్ మార్క్ పార్క్ అవుతందని అన్నారు.
హైదరాబాద్ పరిధిలో అంతర్జాతీయ స్థాయిలోని మొక్కలు లభించడం, అద్భుతమైన కళాఖండాలు ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఈ పార్క్ ఏర్పాటు చేసిన రామ్దేవ్ ఒక కళాకారుడని, పాతికేళ్లుగా పరిశోధనలు చేసి, దేశవిదేశాల నుంచి కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు, శిలలు తెచ్చారని అన్నారు. ఇక్కడ తొలి సినిమా షూటింగ్ అవకాశం తనకే ఇస్తానని చెప్పారని, అయితే, ఈ ఎండలో తాను డ్యాన్స్ చేయలేనేమోనని సెటైర్లు వేశారు. వచ్చే వింటర్ లో తప్పకుండా ఇక్కడ షూటింగ్ చేస్తానని అన్నారు.
ఒకప్పుడు మొక్కలకు వేలు, లక్షలు చెప్పేవారని, ఇప్పుడు మాత్రం కోట్లలో చెబుతున్నారని చిరు చెప్పారు. అయితే, తన సంపాదన ఇప్పుడు అంతంత మాత్రమేనని, వాటిని కొనలేనేమోనని రాం దేవ్తో చెబుతుంటానని చిరు సెటైర్లు వేశారు. అయితే, ఒకసారి వచ్చి ఆ మొక్కలు చూస్తే టెంప్ట్ అవుతారని రాం దేవ్ చెబుతుంటారని చిరు అన్నారు.
This post was last modified on January 28, 2025 7:00 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…