Political News

ఎక్స్ పీరియం ఓపెనింగ్ లో చిరు సెటైర్లు

తెలంగాణలోని ప్రొద్దుటూరులో ‘ఎక్స్ పీరియం ఎకో పార్క్‌’ ను సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి కలిసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవిల మధ్య ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ప్రతి సందర్భంలో చిరంజీవికి రేవంత్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత సభలో కూడా చిరును ప్రస్తావించారు రేవంత్. ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి కూడా రేవంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారని, అయినప్పటికీ ఈ ఎకో పార్క్ ఓపెనింగ్‌కు రావడం సంతోషంగా ఉందని కొనియాడారు.

ఇటువంటి పార్కులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహం అందించడం అభినందనీయమని, వీటి వల్ల ఎంతో మందికి ఉపాధి, రాష్ట్రానికి టూరిజం పెరుగుతుందని అన్నారు. ఈ తరహా పార్కులకు ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్‌పీరియం పార్క్‌ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి వన్నె తెచ్చే ల్యాండ్ మార్క్ పార్క్ అవుతందని అన్నారు.

హైదరాబాద్‌ పరిధిలో అంతర్జాతీయ స్థాయిలోని మొక్కలు లభించడం, అద్భుతమైన కళాఖండాలు ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఈ పార్క్ ఏర్పాటు చేసిన రామ్‌దేవ్ ఒక కళాకారుడని, పాతికేళ్లుగా పరిశోధనలు చేసి, దేశవిదేశాల నుంచి కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు, శిలలు తెచ్చారని అన్నారు. ఇక్కడ తొలి సినిమా షూటింగ్ అవకాశం తనకే ఇస్తానని చెప్పారని, అయితే, ఈ ఎండలో తాను డ్యాన్స్ చేయలేనేమోనని సెటైర్లు వేశారు. వచ్చే వింటర్ లో తప్పకుండా ఇక్కడ షూటింగ్ చేస్తానని అన్నారు.

ఒకప్పుడు మొక్కలకు వేలు, లక్షలు చెప్పేవారని, ఇప్పుడు మాత్రం కోట్లలో చెబుతున్నారని చిరు చెప్పారు. అయితే, తన సంపాదన ఇప్పుడు అంతంత మాత్రమేనని, వాటిని కొనలేనేమోనని రాం దేవ్‌తో చెబుతుంటానని చిరు సెటైర్లు వేశారు. అయితే, ఒకసారి వచ్చి ఆ మొక్కలు చూస్తే టెంప్ట్ అవుతారని రాం దేవ్ చెబుతుంటారని చిరు అన్నారు.

This post was last modified on January 28, 2025 7:00 pm

Share

Recent Posts

స్పిరిట్ కంటే వారణాసి పెద్ద సినిమా: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…

28 minutes ago

బ్రేకింగ్… అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…

32 minutes ago

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

2 hours ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

8 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

10 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

11 hours ago