శనివారం భామకు ఇంకో సూపర్ ఛాన్స్

ఆరేళ్ళ క్రితం నాని గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ డెబ్యూ చేసి ఆ వెంటనే శర్వానంద్ శ్రీకారంలో ఛాన్స్ దక్కించుకున్నప్పటికీ ఆ రెండూ సక్సెస్ కాకపోవడంతో హీరోయిన్ ప్రియాంక మోహన్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఎంచక్కా తమిళంలో సెటిలైపోయింది. శివ కార్తికేయన్ తో వరసగా డాక్టర్, డాన్ రూపంలో రెండు హిట్లు, సూర్య లాంటి స్టార్ సరసన ఈటిలో నటించాక కెరీర్ ఊపందుకుంది. కెప్టెన్ మిల్లర్ లో డిఫరెంట్ పాత్ర దక్కింది కానీ తమిళంలోనే ఏవరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఇతర భాషల్లో ఫ్లాపయ్యింది. కానీ సరిపోదా శనివారం లెక్కలు మార్చేసింది.

రెండోసారి న్యాచురల్ నానికి జోడి కట్టడం బ్లాక్ బస్టర్ అందించింది. ఏకంగా వంద కోట్ల గ్రాసర్ లో భాగమయ్యేలా చేసింది. ఈ చిత్రం నిర్మించిన డివివి బ్యానరే పవన్ కళ్యాణ్ ఓజి తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ ప్రియాంక మోహనే హీరోయిన్. కాకపోతే ఇది కొంచెం ఆలస్యమయ్యేలా ఉంది. తాజాగా విశ్వక్ సేన్ సరసన నటించేందుకు ఈ శనివారం భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. జాతిరత్నాలు, ప్రిన్స్ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించబోయే మూవీలో తననే ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు కన్ఫర్మట.

ఫామ్ లో ఉన్న హీరోయిన్లను ఎంచుకోవడంలో విశ్వక్ సేన్ పాటిస్తున్న స్ట్రాటజీలో వర్కౌట్ అవుతున్నాయి. మెకానిక్ రాకీలో మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. లైలాలో ఆకాంక్ష శర్మని ఎంచుకున్నారు. ఇప్పుడు ప్రియాంక మోహన్ ని లాక్ చేసుకునే పనిలో ఉన్నారు. గ్యాంగ్ అఫ్ గోదావరి నిరాశ పరచడంతో విశ్వక్ కొత్త తరహా సబ్జెక్టులను ఎంచుకునే పనిలో పడ్డాడు. లైలాలో ఏకంగా అమ్మాయి గెటప్ లో కనిపించేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటి జనరేషన్ లో పూర్తి నిడివి లేడీ రోల్స్ చేసినవాళ్లు లేరు. ఇక కెవి అనుదీప్ రాసుకున్న స్టోరీ మాత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని టాక్.