తెలుగు సినిమా గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. ఆయనతో పాటు.. ఆయన కంటే ముందు, వెనుక సంగీత ప్రయాణాన్ని ఆరంభించిన చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు అడ్రస్ లేకుండా పోయారు కానీ.. కీరవాణి మాత్రం ఇప్పటికీ భారీ సినిమాలకు పని చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పుడు ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ అనదగ్గ ‘ఆర్ఆర్ఆర్’కు ఆయనే సంగీతాన్నందిస్తున్న సంగతి తెలిసిందే. అది కాక ఇంకో మూడు సినిమాలకు ఆయన పని చేస్తున్నారు.
ఈ మధ్యే కీరవాణితో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరికొందరు కరోనా బారిన పడటం.. కోలుకున్నాక ప్లాస్మా దానం చేసి స్ఫూర్తి నింపడం తెలిసిన సంగతే. కొన్ని రోజుల విరామం తర్వాత కీరవాణి ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయన తన కొడుకు కాలభైరవతో కలిసి మరోసారి ప్లాస్మా దానం చేశాడు.
దీనికి సంబంధించిన అప్ డేట్ ఇస్తూ.. తన సినీ కెరీర్ గురించి కూడా కీరవాణి అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తాను ‘ఆర్ఆర్ఆర్’తో పాటు రెండు కొత్త సినిమాలకు పని చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో ఒకటి క్రిష్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్నది కాగా.. మరొకటి కె.రాఘవేంద్రరావు నిర్మించేదని వెల్లడించారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ అతి త్వరలోనే మొదలవుతుందని కూడా కీరవాణి వెల్లడించారు.
ఐతే కీరవాణి చెబుతున్న క్రిష్ ప్రాజెక్టు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ ప్రధాన పాత్రల్లో ఓ చిన్న సినిమాను చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నాడు క్రిష్. ఆ సినిమా కోసం పని చేస్తున్నట్లు వెల్లడించిన కీరవాణి.. అదే దర్శకుడితో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమా గురించి అప్ డేట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బహుశా దాని షూటింగ్ ఆలస్యమయ్యేలా ఉండటంతో కీరవాణి దాని పని ఇంకా మొదలుపెట్టలేదేమో. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ త్వరలో మొదలవుతుందన్న కీరవాణి అప్ డేట్ అందుకోసం ఎదురు చూస్తున్న వాళ్లందరికీ ఉత్సాహాన్నిచ్చేదే.
This post was last modified on September 21, 2020 5:22 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…