తెలుగు సినిమా గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. ఆయనతో పాటు.. ఆయన కంటే ముందు, వెనుక సంగీత ప్రయాణాన్ని ఆరంభించిన చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు అడ్రస్ లేకుండా పోయారు కానీ.. కీరవాణి మాత్రం ఇప్పటికీ భారీ సినిమాలకు పని చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పుడు ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ అనదగ్గ ‘ఆర్ఆర్ఆర్’కు ఆయనే సంగీతాన్నందిస్తున్న సంగతి తెలిసిందే. అది కాక ఇంకో మూడు సినిమాలకు ఆయన పని చేస్తున్నారు.
ఈ మధ్యే కీరవాణితో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరికొందరు కరోనా బారిన పడటం.. కోలుకున్నాక ప్లాస్మా దానం చేసి స్ఫూర్తి నింపడం తెలిసిన సంగతే. కొన్ని రోజుల విరామం తర్వాత కీరవాణి ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయన తన కొడుకు కాలభైరవతో కలిసి మరోసారి ప్లాస్మా దానం చేశాడు.
దీనికి సంబంధించిన అప్ డేట్ ఇస్తూ.. తన సినీ కెరీర్ గురించి కూడా కీరవాణి అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తాను ‘ఆర్ఆర్ఆర్’తో పాటు రెండు కొత్త సినిమాలకు పని చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో ఒకటి క్రిష్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్నది కాగా.. మరొకటి కె.రాఘవేంద్రరావు నిర్మించేదని వెల్లడించారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ అతి త్వరలోనే మొదలవుతుందని కూడా కీరవాణి వెల్లడించారు.
ఐతే కీరవాణి చెబుతున్న క్రిష్ ప్రాజెక్టు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ ప్రధాన పాత్రల్లో ఓ చిన్న సినిమాను చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నాడు క్రిష్. ఆ సినిమా కోసం పని చేస్తున్నట్లు వెల్లడించిన కీరవాణి.. అదే దర్శకుడితో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమా గురించి అప్ డేట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బహుశా దాని షూటింగ్ ఆలస్యమయ్యేలా ఉండటంతో కీరవాణి దాని పని ఇంకా మొదలుపెట్టలేదేమో. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ త్వరలో మొదలవుతుందన్న కీరవాణి అప్ డేట్ అందుకోసం ఎదురు చూస్తున్న వాళ్లందరికీ ఉత్సాహాన్నిచ్చేదే.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…