మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయారు. వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన నాని.. హిందూ దేవాలయాలకు సంబంధించి ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న అనుమానాస్పద ఘటనల విషయంలో చాలా తేలిగ్గా మాట్లాడేశారు.
అంతర్వేది రథం కాలిపోతే ఏముంది.. కోటి రూపాయలు పెట్టి ప్రభుత్వమే కొత్తది తయారు చేయిస్తుంది.. దేవుడికొచ్చిన నష్టమేంటి అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆంజనేయుడి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే దేవుడికి ఏమవుతుంది.. దాన్ని బాగు చేయిస్తాం అన్నారు. అలాగే ఏ చర్చికీ మసీదుకూ.. మిగతా ఆలయాలకూ లేని డిక్లరేషన్.. తిరుమల శ్రీవారి ఆలయానికి మాత్రం ఎందుకని కూడా ఆయన ప్రశ్న సంధించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలోనే దుమారం రేపాయి.
నాని దూకుడు ఎలాంటిదో.. ఆయన ప్రత్యర్థుల్ని ఎలా తిట్టిపోస్తారో అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు బూతులు, తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. ఐతే ఎక్కువగా ఆయన టార్గెట్ చేసేది మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, ఇతర తెలుగుదేశం నాయకులనే. వాళ్లను ఎన్ని మాటలన్నా నానీకి చెల్లిపోయింది. రాజకీయ వైరంతో దిగజారి మాట్లాడినా కూడా ఆయనకు వచ్చిన ఇబ్బంది లేకపోయింది. తటస్థంగా ఉండే జనాలకు మంత్రి మాటలు, తీరు ఏమాత్రం రుచించకపోయినా.. చంద్రబాబు అండ్ కో అంటే పడని వాళ్లందరూ ఆ మాటల్ని ఎంజాయ్ చేశారు.
కానీ ఇప్పుడు హిందూ దేవాలయాల విషయంలో చేసిన వ్యాఖ్యలతో నాని తటస్థుల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీకి టార్గెట్గా మారిపోయారు. ఒకప్పుడు ఏపీలో ఒక చోట రోడ్డుకు అడ్డంగా ఉందని, విస్తరణ పనుల్లో భాగంగా వైఎస్ విగ్రహం తొలగించబోతే నాని పెద్ద గొడవ చేశారు. అలాంటిది ఇప్పుడు దేవుళ్ల విగ్రహాలు, రథాల విషయంలో ఇంత తేలిగ్గా మాట్లాడ్డం ఏంటని సోషల్ మీడియాలో జనాలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే తాజా వ్యాఖ్యలతో నాని డేంజర్ జోన్లోకి వచ్చారని, ఆయన జనాగ్రహం చూడక తప్పదని స్పష్టమవుతోంది.
This post was last modified on September 21, 2020 5:21 pm
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…
ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…
హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…
https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…