మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయారు. వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన నాని.. హిందూ దేవాలయాలకు సంబంధించి ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న అనుమానాస్పద ఘటనల విషయంలో చాలా తేలిగ్గా మాట్లాడేశారు.
అంతర్వేది రథం కాలిపోతే ఏముంది.. కోటి రూపాయలు పెట్టి ప్రభుత్వమే కొత్తది తయారు చేయిస్తుంది.. దేవుడికొచ్చిన నష్టమేంటి అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆంజనేయుడి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే దేవుడికి ఏమవుతుంది.. దాన్ని బాగు చేయిస్తాం అన్నారు. అలాగే ఏ చర్చికీ మసీదుకూ.. మిగతా ఆలయాలకూ లేని డిక్లరేషన్.. తిరుమల శ్రీవారి ఆలయానికి మాత్రం ఎందుకని కూడా ఆయన ప్రశ్న సంధించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలోనే దుమారం రేపాయి.
నాని దూకుడు ఎలాంటిదో.. ఆయన ప్రత్యర్థుల్ని ఎలా తిట్టిపోస్తారో అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు బూతులు, తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. ఐతే ఎక్కువగా ఆయన టార్గెట్ చేసేది మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, ఇతర తెలుగుదేశం నాయకులనే. వాళ్లను ఎన్ని మాటలన్నా నానీకి చెల్లిపోయింది. రాజకీయ వైరంతో దిగజారి మాట్లాడినా కూడా ఆయనకు వచ్చిన ఇబ్బంది లేకపోయింది. తటస్థంగా ఉండే జనాలకు మంత్రి మాటలు, తీరు ఏమాత్రం రుచించకపోయినా.. చంద్రబాబు అండ్ కో అంటే పడని వాళ్లందరూ ఆ మాటల్ని ఎంజాయ్ చేశారు.
కానీ ఇప్పుడు హిందూ దేవాలయాల విషయంలో చేసిన వ్యాఖ్యలతో నాని తటస్థుల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీకి టార్గెట్గా మారిపోయారు. ఒకప్పుడు ఏపీలో ఒక చోట రోడ్డుకు అడ్డంగా ఉందని, విస్తరణ పనుల్లో భాగంగా వైఎస్ విగ్రహం తొలగించబోతే నాని పెద్ద గొడవ చేశారు. అలాంటిది ఇప్పుడు దేవుళ్ల విగ్రహాలు, రథాల విషయంలో ఇంత తేలిగ్గా మాట్లాడ్డం ఏంటని సోషల్ మీడియాలో జనాలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే తాజా వ్యాఖ్యలతో నాని డేంజర్ జోన్లోకి వచ్చారని, ఆయన జనాగ్రహం చూడక తప్పదని స్పష్టమవుతోంది.
This post was last modified on September 21, 2020 5:21 pm
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.…
గత కొన్నేళ్లలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సర్ప్రైజింగ్, సెలబ్రేటెడ్ వెడ్డింగ్స్లో కీర్తి సురేష్ది ఒకటని చెప్పాలి. కెరీర్ మంచి…
అందరూ మర్చిపోయి ఎప్పుడో ఆలస్యంగా వస్తుందిలే అని భావిస్తున్న కల్కి 2 పేరు హఠాత్తుగా తెరమీదకు రావడంతో ఒక్కసారిగా ప్రభాస్…
ఇంకా అధికారికంగా ప్రకటించడం, ప్రమోషన్లు చేయడం లాంటివి జరగకపోయినా రేపటి నుంచి దురంధర్ ఓటిటి స్ట్రీమింగ్ జరగడం దాదాపు ఖాయమే.…
థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు…
రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండదని చెబుతూ, ప్రభాస్ అభిమానులకు భరోసానిస్తూ, తేడా…