ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలోనే మంచి స్థాయిని అందుకున్న కథానాయకుడు రాజ్ తరుణ్. అతడి తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’ సూపర్ హిట్. ఆ తర్వాత చేసిన ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్’ కూడా మంచి విజయం సాధించాయి. దీంతో అతడి మీద అంచనాలు పెరిగిపోయాయి. తనతో సినిమాల కోసం దర్శకులు, నిర్మాతలు లైన్లో నిలబడ్డారు. కానీ ఇలా కెరీర్ ఆరంభంలో మంచి ఊపు చూపించి ఆ తర్వాత డౌన్ అయిపోయిన హీరోలు చాలామందే ఉన్నారు. రాజ్ తరుణ్ సైతం ఆ జాబితాలోనే చేరాడు.
గత మూణ్నాలుగేళ్లలో అతను చేసిన సినిమాలేవీ ఆడలేదు. ఒకదాని తర్వాత ఒకటి సినిమా వస్తూనే ఉంది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతూనే ఉంది. అగ్ర నిర్మాత దిల్ రాజు అతడితో ‘లవర్’ తీసి చేతులు కాల్చుకోగా.. మళ్లీ అతడికి హిట్టివ్వాలన్న పట్టుదలతో ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమా తీశాడు. కానీ అది కూడా తుస్సుమంది.
దీని తర్వాత రాజ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ త్వరలోనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో విడుదల కాబోతోంది. దాని సంగతేమవుతుందో చూడాలి. ఈలోపు ఈ యంగ్ హీరో మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. ఇంతకుముందు రాజ్తో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అనే సినిమా తీసి ఫెయిలైన శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
విశేషం ఏంటంటే.. ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్న రాజ్ను, తొలి సినిమాతో మెప్పించలేకపోయిన శ్రీనివాస్ను నమ్మి అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చాడు. ఇంతకుముందు రాజ్ను ‘ఉయ్యాల జంపాల’తో హీరోగా నిలబెట్టింది నాగార్జునే. మళ్లీ ఆయనే అతణ్ని రక్షించడానికి ముందుకు వచ్చాడు. ఐతే ఒకప్పట్టా నాగ్ జడ్జిమెంట్ పని చేయట్లేదని.. ఆయన సినిమాలు, కొడుకుల సినిమాలను బట్టే తెలుస్తోంది. మరి నాగ్.. రాజ్కు సక్సెస్ అందించగలడా?
This post was last modified on September 21, 2020 5:22 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…