ఇష్టం లేకపోయినా అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి కాని కారణంగా ఏప్రిల్ 5 విడుదల తేదీని వదులుకున్న దేవర అక్టోబర్ 10కి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఖచ్చితంగా ఆ డేట్ కి కట్టుబడి ఉంటారా అంటే ఏమో చెప్పలేం. గత రెండు మూడేళ్ళలో ఏ ప్యాన్ ఇండియా సినిమా రెండు మూడు తేదీలు మార్చకుండా థియేటర్లలో అడుగు పెట్టలేదు. సో మార్పులు అనివార్యం. దేవర విషయంలో కొరటాల శివ టాకీ పార్ట్, విఎఫెక్స్ తాలూకు పనులను ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా చూసుకున్నా పాటల విషయంలో మాత్రం వేగం చూపించలేదు. కారణం అనిరుద్ రవిచందరని వేరే చెప్పనక్కర్లేదు.
జాన్వీ కపూర్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. ఇటీవలే ఒక విదేశీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవర కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నానని, కొంత భాగంతో పాటు కొన్ని పాటలు పెండింగ్ ఉన్నాయని అవి కాగానే బయటికి వచ్చేయడమేనని చెప్పింది. ప్రత్యేకంగా ఈ సినిమా కోసమే తెలుగు నేర్చుకుంటున్న సంగతి కూడా పంచుకుంది. ఇక్క సమస్య ఏంటంటే అనిరుధ్ నుంచి బెస్ట్ అనిపించే ట్యూన్స్ రాబట్టుకోవడం. మాములుగా తమిళ దర్శకులు అతన్నుంచి ఎక్కువ ట్యూన్స్ డిమాండ్ చేయరు. ఇచ్చినవి బాగున్నాయని వెంటనే ఓకే చెప్పేస్తారు.
కానీ మన తెలుగు డైరెక్టర్ల వర్కింగ్ స్టైల్ వేరు. ఒక్కో పాటకు రెండు మూడు ఆప్షన్లు ఇస్తే వాటిని హీరోతో పాటు డిస్కస్ చేసుకుని బాగున్నది ఎంచుకుంటారు. ఈ తరహా మోడల్ అనిరుధ్ తో కష్టం. ఎందుకంటే చేతి నిండా సినిమాలతో ఒకే ప్రాజెక్టు మీద ఎక్కువ కాలం ఖర్చు పెట్టే పరిస్థితిలో లేడు. అందుకే కొరటాల శివ ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా ఆయన దేవిశ్రీ ప్రసాద్, మణిశర్మలతో మాత్రమే పని చేశారు. కోలీవుడ్ టెక్నిషియన్స్ తో అనుభవం లేదు. మరి అనిరుధ్ తో అత్యుత్తమైన పాటలు రాబట్టుకోవడం పెను సవాలే. దాన్ని ఎలా దాటుకుంటారో చూడాలి.
This post was last modified on February 22, 2024 5:50 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…