Political News

ఔను.. మ‌మ్మ‌ల్ని వాళ్లే పిలిచారు: టీడీపీ క్లారిటీ

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో బీజేపీతో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే టీడీపీ అదినేత చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిసి వ‌చ్చారు. అయితే..త‌ర్వాత దీనిపై ఏం జ‌రిగిందనేది మాత్రం బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు పూర్తిగా మౌనం దాల్చారు. మ‌రోవైపు బీజేపీ కూడా కేంద్రం పెద్ద‌లు తీసుకునే నిర్ణ‌యాన్ని బ‌ట్టి తాము న‌డుస్తామ‌ని చెప్పిందే త‌ప్ప‌.. మ‌రో మాట లేదు.

ఇదిలావుంటే.. చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ కీల‌క నేత అమిత్‌షాతో భేటీ అయిన త‌ర్వాత‌.. ఏపీలో అధికార పార్టీ వైసీపీ నుంచి కామెంట్లు పెరుగుతున్నాయి. ఎలాంటి ఆహ్వానం లేకుండానే చంద్ర‌బాబు వెళ్లార‌ని.. చంద్ర‌బాబును వారు కోరుకోవ‌డం లేద‌ని.. ఇలా.. అనేక వ్యాఖ్య‌లు, విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. వీటిపై తాజాగా టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. ఔను.. మ‌మ్మ‌ల్ని వాళ్లే పిలిచారు! అని తేల్చి చెప్పారు. “టీడీపీని ఎన్డీఏలోకి రావాల‌ని వాళ్లే ఆహ్వానించారు. దీనిని ఎవ‌రైనా విమ‌ర్శించినా.. వారికి మేం స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదు” అని అన్నారు.

ఎన్డీయేలోకి రమ్మ‌ని పిలిచిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని అన్నారు. ఇందులో దాపరికం ఏమీ లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. “పొత్తులు పెట్టుకునే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవు. ఈ విష‌యాన్ని పార్టీ నాయ‌కులు గ‌మ‌నించాలి. టిక్కెట్లు కొల్పోయిన వాళ్లు బాధ పడొద్దని చంద్రబాబు, పవన్ చెబుతూనే ఉన్నారు. వారికి త‌గిన విధంగా భ‌విష్య‌త్తులో న్యాయం చేస్తామ‌ని అచ్చెన్న అన్నారు. అయితే.. దీనిని ప్ర‌త్య‌ర్థులు అడ్వాంటేజ్‌గా తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని దానికి చాన్స్ ఇవ్వ‌ద్ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇక వలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచకూడదని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఇప్పటికే మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు చేశామని, వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఈసీ చెబుతోంటే.. ధర్మాన దానికి విరుద్దంగా మాట్లాడుతున్నారని.. పోలింగ్ బూత్‌ల‌లో వలంటీర్ల‌ను ఎలా కూర్చోబెడ‌తారని వ్యాఖ్యానించారు.

This post was last modified on February 22, 2024 9:55 pm

Share

Recent Posts

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

10 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

14 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

53 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

4 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

5 hours ago