Political News

ఔను.. మ‌మ్మ‌ల్ని వాళ్లే పిలిచారు: టీడీపీ క్లారిటీ

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో బీజేపీతో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే టీడీపీ అదినేత చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిసి వ‌చ్చారు. అయితే..త‌ర్వాత దీనిపై ఏం జ‌రిగిందనేది మాత్రం బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు పూర్తిగా మౌనం దాల్చారు. మ‌రోవైపు బీజేపీ కూడా కేంద్రం పెద్ద‌లు తీసుకునే నిర్ణ‌యాన్ని బ‌ట్టి తాము న‌డుస్తామ‌ని చెప్పిందే త‌ప్ప‌.. మ‌రో మాట లేదు.

ఇదిలావుంటే.. చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ కీల‌క నేత అమిత్‌షాతో భేటీ అయిన త‌ర్వాత‌.. ఏపీలో అధికార పార్టీ వైసీపీ నుంచి కామెంట్లు పెరుగుతున్నాయి. ఎలాంటి ఆహ్వానం లేకుండానే చంద్ర‌బాబు వెళ్లార‌ని.. చంద్ర‌బాబును వారు కోరుకోవ‌డం లేద‌ని.. ఇలా.. అనేక వ్యాఖ్య‌లు, విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. వీటిపై తాజాగా టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. ఔను.. మ‌మ్మ‌ల్ని వాళ్లే పిలిచారు! అని తేల్చి చెప్పారు. “టీడీపీని ఎన్డీఏలోకి రావాల‌ని వాళ్లే ఆహ్వానించారు. దీనిని ఎవ‌రైనా విమ‌ర్శించినా.. వారికి మేం స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదు” అని అన్నారు.

ఎన్డీయేలోకి రమ్మ‌ని పిలిచిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని అన్నారు. ఇందులో దాపరికం ఏమీ లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. “పొత్తులు పెట్టుకునే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవు. ఈ విష‌యాన్ని పార్టీ నాయ‌కులు గ‌మ‌నించాలి. టిక్కెట్లు కొల్పోయిన వాళ్లు బాధ పడొద్దని చంద్రబాబు, పవన్ చెబుతూనే ఉన్నారు. వారికి త‌గిన విధంగా భ‌విష్య‌త్తులో న్యాయం చేస్తామ‌ని అచ్చెన్న అన్నారు. అయితే.. దీనిని ప్ర‌త్య‌ర్థులు అడ్వాంటేజ్‌గా తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని దానికి చాన్స్ ఇవ్వ‌ద్ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇక వలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచకూడదని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఇప్పటికే మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు చేశామని, వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఈసీ చెబుతోంటే.. ధర్మాన దానికి విరుద్దంగా మాట్లాడుతున్నారని.. పోలింగ్ బూత్‌ల‌లో వలంటీర్ల‌ను ఎలా కూర్చోబెడ‌తారని వ్యాఖ్యానించారు.

This post was last modified on February 22, 2024 9:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago