Political News

జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి- ష‌ర్మిల మ‌రో పిలుపు

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. తాజాగా మ‌రో పిలుపునిచ్చారు. శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇంటిని ముట్ట‌డిస్తామ‌ని ఆమె తెలిపారు. తాజాగా విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్ నిరంకుశ ధోర‌ణిని ప్ర‌తి ఒక్క‌రూ గ‌మ‌నించాల‌ని అన్నారు. మెగా డీఎస్సీ కోసం ఉద్య‌మిస్తున్న విద్యార్థుల‌ను ప‌ట్టించుకోకుండా.. వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ప్ర‌శ్నించారు.

మెగా డీఎస్సీ పేరుతో సీఎం జగన్ దగా డీఎస్సీ ఇచ్చారని ష‌ర్మిల మండిపడ్డారు. వైఎస్ వారసత్వం అంటే ఇదేనా. మహిళనని కూడా చూడకుండా తనను రాత్రి సమయంలో పోలీసు స్టేషన్‌లో ఉంచారని అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో తన చేతికి గాయమైందని తెలిపారు. ఈ రోజు తన పరిస్థితిని చూసి తన తండ్రి దివంగత రాజశేఖర్‌‌రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని, తన తల్లి ఎంతో బాధపడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

డీఎస్సీ విష‌యంలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌భుత్వం మోసం చేసింద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయ‌కుల‌ను వెంట‌నే విడిచి పెట్టాల‌ని.. లేక పోతే.. శుక్ర‌వారం జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డికి పిలుపునిస్తామ‌ని ష‌ర్మిల పిలుపునిచ్చారు. సచివాలయంలో వినతి పత్రం ఇద్దామని వస్తే ఎవ్వరూ అందుబాటులో లేని పరిస్థితి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి ఎందుకు రారని ప్రశ్నించారు.

చివరకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా సచివాలయంలో ఉండరని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలన్నారు. ఏపీలో అసలు పరిపాలన లేదన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం కాపాడట్లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్ర‌జ‌ల ప‌క్షాన తాను పోరాటం చేసి తీరుతాన‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపుతాన‌న్నారు.

This post was last modified on February 22, 2024 9:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

16 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

60 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago