నెలల తరబడి ఎడతెగని ప్రహసనంగా సాగిపోతున్న గేమ్ చేంజర్ ఎప్పుడెప్పుడు అయిపోతుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ ఇండియన్ 2 మీద ఆధారపడి ఉండటంతో దర్శకుడు శంకర్ నిర్ణయం మీదే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లు ఆధారపడి ఉన్నాయి. దీని తర్వాత రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. పైకి ఏం హడావిడి కనిపించడం లేదు కానీ దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప్లస్ స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీని కోసం పెద్ద ప్లానింగే అమలులో ఉంది.
ప్యాన్ ఇండియా రేంజ్ లో తీయబోయే ఈ స్పోర్ట్స్ కం యాక్షన్ డ్రామాకు మూడు వందల కోట్ల బడ్జెట్ కేటాయించారట. విజయ్ సేతుపతిని లాక్ చేశారని, షెడ్యూల్స్ ఫిక్స్ అయ్యాక అప్పుడు ఆయన అందుబాటుని బట్టి కాల్ షీట్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఉప్పెనతో తనకు పెద్ద పేరు ఇచ్చిన బుచ్చిబాబు నుంచి అంతకు మించిన క్యారెక్టర్ వచ్చేసరికి మక్కల్ సెల్వన్ సంతోషం వ్యక్తం చేశారట. ఇక మాజీ హీరోయిన్ లయకో కీలక పాత్ర ఇచ్చారని తెలిసింది. ఇది షాకింగ్ గా ఉంటుందని, రమ్యకృష్ణ రేంజ్ నటీమణులు పోషించే రోల్ లో లయ దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంటారట.
ఇవన్నీ ఒక ఎత్తయితే ఏఆర్ రెహమాన్ సంగీతం మీద అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తానీ ప్రాజెక్టు చేస్తున్నట్టు ఆయనే స్వయంగా చెప్పడంతో డౌట్ తీరిపోయింది. కాకపోతే రెహమాన్ నుంచి బెస్ట్ ఆల్బమ్ రాబట్టుకోవడం బుచ్చిబాబు చేతుల్లో ఉంది. గేమ్ చేంజర్ కు గుమ్మడి కాయ కొట్టడానికి ఫిబ్రవరి వచ్చేలా ఉంది. అదే జరిగితే 2024 దీపావళి లేదా దసరా తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. ఇది తెలిసే నిర్మాత దిల్ రాజు టీమ్ ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా మౌనంగా ఉన్నారు. సంక్రాంతికి టీజర్ వదిలే ఆలోచనైతే ప్రస్తుతానికి చేస్తున్నారు.
This post was last modified on July 23, 2023 5:00 pm
నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…
ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…
అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితంపై స్పందించారు. ఇంకా ఫలితం…
ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటే తాడేపల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే.. ఇది 41 రోజుల…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…