ప్రస్తుతం ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో ‘ఇండియన్-2’ ఒకటి. రెండున్నర దశాబ్దాల కిందట సంచలనం రేపిన ‘ఇండియన్/భారతీయుడు’ సినిమాకు కొనసాగింపుగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘ఇండియన్’లో హీరోగా నటించిన కమల్ హాసనే ఇప్పుడు కూడా లీడ్ రోల్ చేస్తున్నాడు.
నాలుగేళ్ల కిందటే మొదలైన ఈ సినిమా సెట్లో జరిగిన ఘోర ప్రమాదం, కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. రెండేళ్లకు పైగా షూటింగ్ ఆపేశారు. ఐతే దర్శక నిర్మాతలు, హీరో మాట్లాడుకుని గత ఏడాది చివర్లో మళ్లీ చిత్రీకరణను పున:ప్రారంభించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అనుకుంటున్నారు. ప్రస్తుతం శంకర్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు సినిమా బిజినెస్ చర్చలు మొదలయ్యాయి.
రిలీజ్కు చాలా టైం ఉండగానే ఈ సినిమాకు క్రేజీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మీద ఉన్న అంచనాలను మించి దీనికి డిజిటల్ డీల్ ఆఫర్ ఒకటి వచ్చినట్లు సమాచారం. స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.220 కోట్లకు ఈ సినిమా డిజిటల్ హక్కులు కొనబోతున్నట్లు తెలిసింది. అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులకూ కలిపి ఈ రేట్ కోట్ చేశారట.
ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ రేటు అనిపించినా.. రిలీజ్ టైంకి దీన్ని ఈజీగా వర్కవుట్ చేయొచ్చని నెట్ ఫ్లిక్స్ భావిస్తోందట. ‘ఇండియన్-2’ డిజిటల్ హక్కుల కోసం అమేజాన్ ప్రైమ్, జీ ఓటీటీలు కూడా గట్టిగా పోటీ పడుతున్నట్లు సమాచారం. ఐతే నెట్ ఫ్లిక్స్కే హక్కులు సొంతమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని రూ.200 కోట్లలో తీయాలనుకున్నారు కానీ.. సినిమా పూర్తయ్యేసరికి బడ్జెట్ రూ.300 కోట్లను దాటబోతున్నట్లు సమాచారం. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…