2023లో వచ్చిన తెలుగు చిత్రాల్లో అతి పెద్ద డిజాస్టర్ ‘ఏజెంట్’యే. నిర్మాత అనిల్ సుంకర చెప్పిన లెక్క ప్రకారం ఈ సినిమా బడ్జెట్ రూ.80 కోట్లు. కానీ అందులో పదో వంతు షేర్ కూడా రాలేదు ఈ చిత్రానికి. ఎంత నాన్ థియేట్రికల్ ఆదాయం కలుపుకున్నా కూడా బడ్జెట్లో సగం కూడా వెనక్కి రానట్లే. వారం రోజుల్లోపే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిపోగా.. అంతలోనే ప్రేక్షకులకు సారీ చెబుతూ నిర్మాత అనిల్ సుంకర ఒక నోట్ రిలీజ్ చేయడం చర్చనీయాంశం అయింది.
ఇందులో అఖిల్ కష్టాన్ని కొనియాడిన ఆయన.. దర్శకుడు సురేందర్ రెడ్డి మీద పరోక్ష విమర్శలు గుప్పించాడు. బౌండ్ స్క్రిప్టు లేకుండా సినిమా తీయడం తాము చేసిన తప్పని అన్నాడు. మరోవైపు అఖిల్ అభిమానులకు సారీ చెబుతూ రిలీజ్ చేసిన నోట్లో దర్శకుడి పేరు ప్రస్తావించకపోవడంతో హీరో, నిర్మాత ఇద్దరూ ‘ఏజెంట్’ ఫలితానికి సూరినే నిందిస్తున్నట్లు అనిపించింది.
ఐతే పెద్ద నష్టం జరిగినపుడు ఇలా ఆగ్రహాన్ని వెలిబుచ్చాక.. కొన్నాళ్లకు మనసు మారడం మామూలే. నిర్మాత అనిల్ ఆలోచన కూడా అలాగే మారినట్లుంది. తన నిర్మాణంలో వచ్చిన కొత్త చిత్రం ‘సామజవరగమన’ సూపర్ హిట్ దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సురేందర్ విషయంలో కొంచెం సానుకూల వ్యాఖ్యలు చేశారు. ‘‘బౌండ్ స్క్రిప్టుతో సెట్కు వెళ్లామంటే నిర్మాణ వ్యయం దఅదుపులో ఉంటుంది. ఫలితం అటు ఇటు అయినా పది శాతం ప్రభావమే ఉంటుంది.
‘ఏజెంట్’కు సంబంధించి ఈ విషయంలోనే తప్పు జరిగింది. రకరకాల కారణాలతో బౌండ్ స్క్రిప్టుతో సెట్కు వెళ్లలేకపోయాం. నేనైనా, దర్శకుడైనా అఖిల్ను ఈ సినిమాతో పెద్ద రేంజికి తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతోనే రంగంలోకి దిగాం. ఫలితం మరోలా వచ్చింది. ఇందులో మా అందరి తప్పూ ఉంది. మా సినిమాకు తప్పు ఎక్కడ జరిగిందో తెలిసింది కాబట్టి.. ఇంకెవరూ అలా చేయొద్దనే అలా ట్వీట్ చేశా’’ అని అనిల్ వివరణ ఇచ్చాడు.
This post was last modified on July 4, 2023 9:58 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…