2023లో వచ్చిన తెలుగు చిత్రాల్లో అతి పెద్ద డిజాస్టర్ ‘ఏజెంట్’యే. నిర్మాత అనిల్ సుంకర చెప్పిన లెక్క ప్రకారం ఈ సినిమా బడ్జెట్ రూ.80 కోట్లు. కానీ అందులో పదో వంతు షేర్ కూడా రాలేదు ఈ చిత్రానికి. ఎంత నాన్ థియేట్రికల్ ఆదాయం కలుపుకున్నా కూడా బడ్జెట్లో సగం కూడా వెనక్కి రానట్లే. వారం రోజుల్లోపే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిపోగా.. అంతలోనే ప్రేక్షకులకు సారీ చెబుతూ నిర్మాత అనిల్ సుంకర ఒక నోట్ రిలీజ్ చేయడం చర్చనీయాంశం అయింది.
ఇందులో అఖిల్ కష్టాన్ని కొనియాడిన ఆయన.. దర్శకుడు సురేందర్ రెడ్డి మీద పరోక్ష విమర్శలు గుప్పించాడు. బౌండ్ స్క్రిప్టు లేకుండా సినిమా తీయడం తాము చేసిన తప్పని అన్నాడు. మరోవైపు అఖిల్ అభిమానులకు సారీ చెబుతూ రిలీజ్ చేసిన నోట్లో దర్శకుడి పేరు ప్రస్తావించకపోవడంతో హీరో, నిర్మాత ఇద్దరూ ‘ఏజెంట్’ ఫలితానికి సూరినే నిందిస్తున్నట్లు అనిపించింది.
ఐతే పెద్ద నష్టం జరిగినపుడు ఇలా ఆగ్రహాన్ని వెలిబుచ్చాక.. కొన్నాళ్లకు మనసు మారడం మామూలే. నిర్మాత అనిల్ ఆలోచన కూడా అలాగే మారినట్లుంది. తన నిర్మాణంలో వచ్చిన కొత్త చిత్రం ‘సామజవరగమన’ సూపర్ హిట్ దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సురేందర్ విషయంలో కొంచెం సానుకూల వ్యాఖ్యలు చేశారు. ‘‘బౌండ్ స్క్రిప్టుతో సెట్కు వెళ్లామంటే నిర్మాణ వ్యయం దఅదుపులో ఉంటుంది. ఫలితం అటు ఇటు అయినా పది శాతం ప్రభావమే ఉంటుంది.
‘ఏజెంట్’కు సంబంధించి ఈ విషయంలోనే తప్పు జరిగింది. రకరకాల కారణాలతో బౌండ్ స్క్రిప్టుతో సెట్కు వెళ్లలేకపోయాం. నేనైనా, దర్శకుడైనా అఖిల్ను ఈ సినిమాతో పెద్ద రేంజికి తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతోనే రంగంలోకి దిగాం. ఫలితం మరోలా వచ్చింది. ఇందులో మా అందరి తప్పూ ఉంది. మా సినిమాకు తప్పు ఎక్కడ జరిగిందో తెలిసింది కాబట్టి.. ఇంకెవరూ అలా చేయొద్దనే అలా ట్వీట్ చేశా’’ అని అనిల్ వివరణ ఇచ్చాడు.
This post was last modified on July 4, 2023 9:58 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…