లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న లియోలో రామ్ చరణ్ చిన్న క్యామియో చేశాడన్న వార్త సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇది నిజమా కాదాని చెప్పడానికి టీమ్ సిద్ధంగా లేదు. పోనీ ఖండించేస్తే ఒక పనైపోతుందనుకుంటే రోజుకో పుకారు పుట్టిస్తారు కాబట్టి అన్నిటికి వివరణ ఇచ్చుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. అందుకే మౌనం వహించడం తప్ప మరో మార్గం లేదు. విక్రమ్ ప్రమోషన్ సమయంలో లోకేష్ త్వరలో రామ్ చరణ్ సినిమా ఉండొచ్చని చూచాయగా చెప్పాడు. ఇటీవలే ప్రభాస్ కో స్క్రిప్ట్ రాస్తున్నానని చెప్పాడు.
ఖచ్చితంగా ఏది జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే రోలెక్స్, ఖైదీ 2, విక్రమ్ 2 అంటూ కథలు సిద్ధం చేసి లోకి యూనివర్స్ పేరుతో పెద్ద సెటప్ రెడీ చేసుకున్నాడు. అలాంటప్పుడు తెలుగు హీరోలతో చేసే అవకాశాలు తక్కువే. ఇక లియో సంగతికి వస్తే విక్రమ్ క్లైమాక్స్ లో ఎలా అయితే సూర్య క్యారెక్టర్ హైలైట్ అయ్యిందో అదే తరహాలో ఇందులోనూ డిజైన్ చేశాడనే టాక్ ఉంది. కానీ చెన్నై మీడియా వెర్షన్ వేరేలా ఉంది. తన సినిమాలో కొద్ది నిమిషాలే అయినా ఇంకో హీరో డామినేషన్ ని విజయ్ ఒప్పుకునే ఛాన్స్ లేదని గత పదేళ్లకు పైగా ఎవరిని చేయనివ్వలేదని అంటున్నారు
ఇదంతా తేలాలంటే అక్టోబర్ దాకా ఆగాల్సిందే. అంతకన్నా ఆప్షన్ లేదు. ఇలాంటి క్యామియోలు అడిగినప్పుడు చరణ్ మొహమాట పడడు. సల్మాన్ ఖాన్ కోసం కిసీకా భాయ్ కిసీకా జాన్ లో ఓ పిచ్చి పాటకు డాన్స్ చేశాడు. తీరా అది డిజాస్టర్ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. కాబట్టి నిజంగా లోకేష్ అడిగి, అది సూర్య రేంజ్ క్యారెక్టర్ అయ్యుంటే ఖచ్చితంగా ఎస్ చెప్పే ఉంటాడు. కాకపోతే విజయ్ దానికి అనుమతి ఇచ్చాడా లేదానీదే కీలకం. తన డబ్బింగ్ చిత్రం ఎంత గ్రాండ్ గా రిలీజ్ చేసినా కనీసం హైదరాబాద్ మీడియాతో మాట్లాడని హీరో టాలీవుడ్ స్టార్ ని భాగం చేసుకుంటాడా
This post was last modified on July 4, 2023 10:57 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…