తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఫిలిం ఛాంబర్ కోరినా అందరికంటే నేనే ముందు చెప్పాననే లాజిక్ తో వారసుడు భారీ రిలీజ్ కోసం దిల్ రాజు తన ప్లానింగ్ ని కొనసాగిస్తున్నారని బయ్యర్స్ టాక్. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిల కోసం స్క్రీన్లు కాసిన్ని ఎక్కువ ఇవ్వడం లాంటివేవీ జరగడం లేదని వినికిడి. తాజాగా అజిత్ తునివు డబ్బింగ్ రైట్స్ వేరొకరికి అమ్మేశారు. మూడు కోట్లకు డీల్ కుదిరిందని సమాచారం. తెగింపు టైటిల్ ని పరిశీలిస్తున్నారు. రిజిస్టర్ అయ్యిందో లేదో చెక్ చేసుకునే పనిలో పడ్డారు. ఒకవేళ కుదరకపోతే వలిమై లాగా అదే పేరు పెట్టినా ఆశ్చర్యం లేదు.
ఇదంతా బాగానే ఉంది కానీ మెల్లగా ప్రమోషన్లు ఊపందుకుంటున్నాయి. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్లు గట్రా చేయాలి. ముఖ్యంగా వారసుడుకి రాజుగారు ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తారోనని ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. చెన్నైలో అంగరంగ వైభవంగా జరుగుతుంది కానీ హైదరాబాద్ లో చేసే ఫంక్షన్ కి విజయ్ ని తీసుకొస్తారానేది ఆసక్తికరంగా మారింది. తుపాకీ నుంచి మార్కెట్ పెరిగినా విజయ్ ఏనాడూ కనీసం ఇక్కడి మీడియాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. మాస్టర్ కి విపరీతమైన పోటీలో మంచి రిలీజ్ దక్కినా భాగ్యనగరంలో అడుగు పెట్టలేదు. ఇక్కడే నిర్మాతలే చెన్నై వెళ్లి ఫోటోలు దిగారు.
దిల్ రాజుని తక్కువ అంచనా వేయలేం కానీ ఎప్పుడూ లేనిది వారసుడు కోసం విజయ్ వస్తాడా అనేది వేయి డాలర్ల ప్రశ్న. ఇక అజిత్ సంగతి తెలిసిందే. తన కెరీర్ మూలాలు ప్రేమపుస్తకంతో మొదలుపెట్టి టాలీవుడ్ లోనే ఉన్నాయని తెలిసినా కూడా ఇక్కడ ఈవెంట్ల మీద ఆసక్తి చూపించలేదు. తమిళంలోనే నో అనే ఆయన మన దగ్గరికి వస్తారనుకోవడం అత్యాశే. ఎవరిష్టం వాళ్ళదని సింపుల్ గా చెప్పడానికి లేదు. సినిమా అనేది పబ్లిక్ కోసమే అయినప్పుడు జనంలోకి స్టార్లు రావాలి. అప్పుడే రీచ్ మరింత పెరుగుతుంది. రజనీకాంత్, విక్రమ్, కార్తీలు ఎన్నిసార్లు వచ్చారో లెక్క లేదు. మరి విజయ్ అజిత్ లు ఈసారికైనా కరుణిస్తారో లేదో.
This post was last modified on December 6, 2022 1:23 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…