తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఫిలిం ఛాంబర్ కోరినా అందరికంటే నేనే ముందు చెప్పాననే లాజిక్ తో వారసుడు భారీ రిలీజ్ కోసం దిల్ రాజు తన ప్లానింగ్ ని కొనసాగిస్తున్నారని బయ్యర్స్ టాక్. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిల కోసం స్క్రీన్లు కాసిన్ని ఎక్కువ ఇవ్వడం లాంటివేవీ జరగడం లేదని వినికిడి. తాజాగా అజిత్ తునివు డబ్బింగ్ రైట్స్ వేరొకరికి అమ్మేశారు. మూడు కోట్లకు డీల్ కుదిరిందని సమాచారం. తెగింపు టైటిల్ ని పరిశీలిస్తున్నారు. రిజిస్టర్ అయ్యిందో లేదో చెక్ చేసుకునే పనిలో పడ్డారు. ఒకవేళ కుదరకపోతే వలిమై లాగా అదే పేరు పెట్టినా ఆశ్చర్యం లేదు.
ఇదంతా బాగానే ఉంది కానీ మెల్లగా ప్రమోషన్లు ఊపందుకుంటున్నాయి. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్లు గట్రా చేయాలి. ముఖ్యంగా వారసుడుకి రాజుగారు ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తారోనని ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. చెన్నైలో అంగరంగ వైభవంగా జరుగుతుంది కానీ హైదరాబాద్ లో చేసే ఫంక్షన్ కి విజయ్ ని తీసుకొస్తారానేది ఆసక్తికరంగా మారింది. తుపాకీ నుంచి మార్కెట్ పెరిగినా విజయ్ ఏనాడూ కనీసం ఇక్కడి మీడియాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. మాస్టర్ కి విపరీతమైన పోటీలో మంచి రిలీజ్ దక్కినా భాగ్యనగరంలో అడుగు పెట్టలేదు. ఇక్కడే నిర్మాతలే చెన్నై వెళ్లి ఫోటోలు దిగారు.
దిల్ రాజుని తక్కువ అంచనా వేయలేం కానీ ఎప్పుడూ లేనిది వారసుడు కోసం విజయ్ వస్తాడా అనేది వేయి డాలర్ల ప్రశ్న. ఇక అజిత్ సంగతి తెలిసిందే. తన కెరీర్ మూలాలు ప్రేమపుస్తకంతో మొదలుపెట్టి టాలీవుడ్ లోనే ఉన్నాయని తెలిసినా కూడా ఇక్కడ ఈవెంట్ల మీద ఆసక్తి చూపించలేదు. తమిళంలోనే నో అనే ఆయన మన దగ్గరికి వస్తారనుకోవడం అత్యాశే. ఎవరిష్టం వాళ్ళదని సింపుల్ గా చెప్పడానికి లేదు. సినిమా అనేది పబ్లిక్ కోసమే అయినప్పుడు జనంలోకి స్టార్లు రావాలి. అప్పుడే రీచ్ మరింత పెరుగుతుంది. రజనీకాంత్, విక్రమ్, కార్తీలు ఎన్నిసార్లు వచ్చారో లెక్క లేదు. మరి విజయ్ అజిత్ లు ఈసారికైనా కరుణిస్తారో లేదో.
This post was last modified on December 6, 2022 1:23 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…