తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఫిలిం ఛాంబర్ కోరినా అందరికంటే నేనే ముందు చెప్పాననే లాజిక్ తో వారసుడు భారీ రిలీజ్ కోసం దిల్ రాజు తన ప్లానింగ్ ని కొనసాగిస్తున్నారని బయ్యర్స్ టాక్. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిల కోసం స్క్రీన్లు కాసిన్ని ఎక్కువ ఇవ్వడం లాంటివేవీ జరగడం లేదని వినికిడి. తాజాగా అజిత్ తునివు డబ్బింగ్ రైట్స్ వేరొకరికి అమ్మేశారు. మూడు కోట్లకు డీల్ కుదిరిందని సమాచారం. తెగింపు టైటిల్ ని పరిశీలిస్తున్నారు. రిజిస్టర్ అయ్యిందో లేదో చెక్ చేసుకునే పనిలో పడ్డారు. ఒకవేళ కుదరకపోతే వలిమై లాగా అదే పేరు పెట్టినా ఆశ్చర్యం లేదు.
ఇదంతా బాగానే ఉంది కానీ మెల్లగా ప్రమోషన్లు ఊపందుకుంటున్నాయి. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్లు గట్రా చేయాలి. ముఖ్యంగా వారసుడుకి రాజుగారు ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తారోనని ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. చెన్నైలో అంగరంగ వైభవంగా జరుగుతుంది కానీ హైదరాబాద్ లో చేసే ఫంక్షన్ కి విజయ్ ని తీసుకొస్తారానేది ఆసక్తికరంగా మారింది. తుపాకీ నుంచి మార్కెట్ పెరిగినా విజయ్ ఏనాడూ కనీసం ఇక్కడి మీడియాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. మాస్టర్ కి విపరీతమైన పోటీలో మంచి రిలీజ్ దక్కినా భాగ్యనగరంలో అడుగు పెట్టలేదు. ఇక్కడే నిర్మాతలే చెన్నై వెళ్లి ఫోటోలు దిగారు.
దిల్ రాజుని తక్కువ అంచనా వేయలేం కానీ ఎప్పుడూ లేనిది వారసుడు కోసం విజయ్ వస్తాడా అనేది వేయి డాలర్ల ప్రశ్న. ఇక అజిత్ సంగతి తెలిసిందే. తన కెరీర్ మూలాలు ప్రేమపుస్తకంతో మొదలుపెట్టి టాలీవుడ్ లోనే ఉన్నాయని తెలిసినా కూడా ఇక్కడ ఈవెంట్ల మీద ఆసక్తి చూపించలేదు. తమిళంలోనే నో అనే ఆయన మన దగ్గరికి వస్తారనుకోవడం అత్యాశే. ఎవరిష్టం వాళ్ళదని సింపుల్ గా చెప్పడానికి లేదు. సినిమా అనేది పబ్లిక్ కోసమే అయినప్పుడు జనంలోకి స్టార్లు రావాలి. అప్పుడే రీచ్ మరింత పెరుగుతుంది. రజనీకాంత్, విక్రమ్, కార్తీలు ఎన్నిసార్లు వచ్చారో లెక్క లేదు. మరి విజయ్ అజిత్ లు ఈసారికైనా కరుణిస్తారో లేదో.
This post was last modified on December 6, 2022 1:23 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…