Political News

వైసీపీ నేత‌లు వంశీ, అవినాష్ ఇళ్ల‌లో ఐటీ దాడులు రీజనేంటి?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. తెల్ల‌వారు జామునే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు కీల‌క‌నాయ‌కులు, వ్యాపార వేత్త‌ల ఇళ్లు, కార్యాల‌యాల్లో సోదాలు ప్రారంభించాయి. వీటిలో ఏపీ అధికార పార్టీ నేత‌లు వ‌ల్ల‌భ‌నేని వంశీ, దేవినేని అవినాష్ లు కూడా ఉండ‌డంతో రాజ‌కీయంగా కూడా ఈ దాడులు చ‌ర్చకు దారితీశాయి.

రెండు రాష్ట్రాల్లోనూ 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో 20కిపైగా బృందాలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో ఉన్న వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి బావమరిది, డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. వంశీరామ్ కార్యాలయం, ఇళ్లల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు దాడులు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, రాజ‌కీయ నేత‌ల విష‌యానికి వ‌స్తే.. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం వైసీపీ సానుభూతిప‌రుడిగా మారిన‌ వల్లభనేని వంశీ, వైసీపీ యువ‌నేత,బెజ‌వాడ‌ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్‌ ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. అవినాష్‌ ఇంట్లో ఉదయం 6.30గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో హ‌వాలా మార్గంలో అవినాష్‌కు డ‌బ్బులు చేకూరాయ‌న్న విష‌యంపై ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు.  

This post was last modified on December 6, 2022 11:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మారుతికి కొత్త‌ర‌కం టార్చ‌ర్

రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండ‌ద‌ని చెబుతూ, ప్ర‌భాస్ అభిమానుల‌కు భ‌రోసానిస్తూ, తేడా…

1 hour ago

సంచలన బిల్లు: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…

2 hours ago

శంక‌ర్‌కు బ‌డా నిర్మాత కండిష‌న్‌

రాజ‌మౌళి కంటే ముందు సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుత‌మైన క‌థ‌లు, క‌ళ్లు చెదిరే విజువ‌ల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…

2 hours ago

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

3 hours ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

3 hours ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

6 hours ago