Political News

వైసీపీ నేత‌లు వంశీ, అవినాష్ ఇళ్ల‌లో ఐటీ దాడులు రీజనేంటి?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. తెల్ల‌వారు జామునే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు కీల‌క‌నాయ‌కులు, వ్యాపార వేత్త‌ల ఇళ్లు, కార్యాల‌యాల్లో సోదాలు ప్రారంభించాయి. వీటిలో ఏపీ అధికార పార్టీ నేత‌లు వ‌ల్ల‌భ‌నేని వంశీ, దేవినేని అవినాష్ లు కూడా ఉండ‌డంతో రాజ‌కీయంగా కూడా ఈ దాడులు చ‌ర్చకు దారితీశాయి.

రెండు రాష్ట్రాల్లోనూ 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో 20కిపైగా బృందాలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో ఉన్న వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి బావమరిది, డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. వంశీరామ్ కార్యాలయం, ఇళ్లల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు దాడులు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, రాజ‌కీయ నేత‌ల విష‌యానికి వ‌స్తే.. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం వైసీపీ సానుభూతిప‌రుడిగా మారిన‌ వల్లభనేని వంశీ, వైసీపీ యువ‌నేత,బెజ‌వాడ‌ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్‌ ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. అవినాష్‌ ఇంట్లో ఉదయం 6.30గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో హ‌వాలా మార్గంలో అవినాష్‌కు డ‌బ్బులు చేకూరాయ‌న్న విష‌యంపై ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు.  

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

5 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

5 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

5 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

6 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

7 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

8 hours ago