Political News

వైసీపీ నేత‌లు వంశీ, అవినాష్ ఇళ్ల‌లో ఐటీ దాడులు రీజనేంటి?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. తెల్ల‌వారు జామునే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు కీల‌క‌నాయ‌కులు, వ్యాపార వేత్త‌ల ఇళ్లు, కార్యాల‌యాల్లో సోదాలు ప్రారంభించాయి. వీటిలో ఏపీ అధికార పార్టీ నేత‌లు వ‌ల్ల‌భ‌నేని వంశీ, దేవినేని అవినాష్ లు కూడా ఉండ‌డంతో రాజ‌కీయంగా కూడా ఈ దాడులు చ‌ర్చకు దారితీశాయి.

రెండు రాష్ట్రాల్లోనూ 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో 20కిపైగా బృందాలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో ఉన్న వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి బావమరిది, డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. వంశీరామ్ కార్యాలయం, ఇళ్లల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు దాడులు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, రాజ‌కీయ నేత‌ల విష‌యానికి వ‌స్తే.. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం వైసీపీ సానుభూతిప‌రుడిగా మారిన‌ వల్లభనేని వంశీ, వైసీపీ యువ‌నేత,బెజ‌వాడ‌ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్‌ ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. అవినాష్‌ ఇంట్లో ఉదయం 6.30గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో హ‌వాలా మార్గంలో అవినాష్‌కు డ‌బ్బులు చేకూరాయ‌న్న విష‌యంపై ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు.  

This post was last modified on December 6, 2022 11:21 am

Share

Recent Posts

జగన్ కు జైల్లో అవమానం?

కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…

28 minutes ago

దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ!

ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…

2 hours ago

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం… పొత్తే కారణమా?

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు

రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…

5 hours ago

అతిగా ఫోన్ వాడిన షకీలా ఇప్పుడు ఎలా ఉందంటే…

ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌తో…

5 hours ago

ఫ్యాన్స్ వద్దా జాన్వీ మేడమ్?

ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…

5 hours ago