Political News

వైసీపీ నేత‌లు వంశీ, అవినాష్ ఇళ్ల‌లో ఐటీ దాడులు రీజనేంటి?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. తెల్ల‌వారు జామునే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు కీల‌క‌నాయ‌కులు, వ్యాపార వేత్త‌ల ఇళ్లు, కార్యాల‌యాల్లో సోదాలు ప్రారంభించాయి. వీటిలో ఏపీ అధికార పార్టీ నేత‌లు వ‌ల్ల‌భ‌నేని వంశీ, దేవినేని అవినాష్ లు కూడా ఉండ‌డంతో రాజ‌కీయంగా కూడా ఈ దాడులు చ‌ర్చకు దారితీశాయి.

రెండు రాష్ట్రాల్లోనూ 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో 20కిపైగా బృందాలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో ఉన్న వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి బావమరిది, డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. వంశీరామ్ కార్యాలయం, ఇళ్లల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు దాడులు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, రాజ‌కీయ నేత‌ల విష‌యానికి వ‌స్తే.. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం వైసీపీ సానుభూతిప‌రుడిగా మారిన‌ వల్లభనేని వంశీ, వైసీపీ యువ‌నేత,బెజ‌వాడ‌ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్‌ ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. అవినాష్‌ ఇంట్లో ఉదయం 6.30గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో హ‌వాలా మార్గంలో అవినాష్‌కు డ‌బ్బులు చేకూరాయ‌న్న విష‌యంపై ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు.  

This post was last modified on December 6, 2022 11:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

7 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

13 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

44 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago