టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడును సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడడం ఆసక్తిగా మారింది. అంతేకాదు.. టీడీపీలోనూ ఉత్సాహాన్ని పెంచిందనే చెప్పాలి. తాజాగా జీ20 సదస్సుకు సంబంధించి ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఇది.. ఈ సమావేశానికి పాల్గొన్న వారిని మంత్ర ముగ్ధులను చేసిందనే చెప్పాలి.
చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే పాతికేళ్లకు సంబంధించి ఒక సమగ్ర విజన్ రూపొందించుకోవాలని సూచించారు. అంతేకాదు.. యువ శక్తిని వినియోగించుకుని దేశం పురోభివృద్ధిలో ముందుకు నడవాలని కూడా కోరుకున్నారు. ఇక, సాంకేతిక పరంగా కూడా దూకుడు చూపించాలని అన్నారు. డిజిటల్ యుగంలో మరింత పురోభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని తెలిపారు.
ఈ విషయాలు నిజంగా సమావేశానికి వచ్చిన వారు ఎవరూ కూడా ప్రస్తావించలేదనే చెప్పాలి. దీంతో అందరి దృష్టీ మాజీ సీఎం చంద్రబాబుపైనే పడింది. ఈ విషయంపై ముగ్ధులైన ప్రధాని.. తర్వాత తన ఉపన్యాసంలోనూ.. ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ దిశగా కార్యాచరణకు అందరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. తర్వాత వ్యక్తిగతంగా చంద్రబాబు తో మాట్లాడిన సమయంలోనూ ప్రధాని ఇదే విషయం చెప్పారు.
ఈ పరిణామాలతో ఇప్పటి వరకు ఏపీ అధికార పార్టీ వైసీపీ ఏదైతే చంద్రబాబు పై విమర్శలు చేస్తోందో అవన్నీ తుడిచి పెట్టుకుపోయాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు విజన్కు సాటి రారెవ్వరూ అని వ్యాఖ్యానించారు. ఆయన విజన్ సజీవమని.. చంద్రబాబుకు కేవలం రాజకీయాలే ముఖ్యం కాదని, రాష్ట్ర, దేశభవిష్యత్తులు అత్యంత ప్రధానమనే విషయం మరో సారి స్పష్టమైందని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on December 6, 2022 1:27 pm
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…