టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడును సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడడం ఆసక్తిగా మారింది. అంతేకాదు.. టీడీపీలోనూ ఉత్సాహాన్ని పెంచిందనే చెప్పాలి. తాజాగా జీ20 సదస్సుకు సంబంధించి ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఇది.. ఈ సమావేశానికి పాల్గొన్న వారిని మంత్ర ముగ్ధులను చేసిందనే చెప్పాలి.
చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే పాతికేళ్లకు సంబంధించి ఒక సమగ్ర విజన్ రూపొందించుకోవాలని సూచించారు. అంతేకాదు.. యువ శక్తిని వినియోగించుకుని దేశం పురోభివృద్ధిలో ముందుకు నడవాలని కూడా కోరుకున్నారు. ఇక, సాంకేతిక పరంగా కూడా దూకుడు చూపించాలని అన్నారు. డిజిటల్ యుగంలో మరింత పురోభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని తెలిపారు.
ఈ విషయాలు నిజంగా సమావేశానికి వచ్చిన వారు ఎవరూ కూడా ప్రస్తావించలేదనే చెప్పాలి. దీంతో అందరి దృష్టీ మాజీ సీఎం చంద్రబాబుపైనే పడింది. ఈ విషయంపై ముగ్ధులైన ప్రధాని.. తర్వాత తన ఉపన్యాసంలోనూ.. ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ దిశగా కార్యాచరణకు అందరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. తర్వాత వ్యక్తిగతంగా చంద్రబాబు తో మాట్లాడిన సమయంలోనూ ప్రధాని ఇదే విషయం చెప్పారు.
ఈ పరిణామాలతో ఇప్పటి వరకు ఏపీ అధికార పార్టీ వైసీపీ ఏదైతే చంద్రబాబు పై విమర్శలు చేస్తోందో అవన్నీ తుడిచి పెట్టుకుపోయాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు విజన్కు సాటి రారెవ్వరూ అని వ్యాఖ్యానించారు. ఆయన విజన్ సజీవమని.. చంద్రబాబుకు కేవలం రాజకీయాలే ముఖ్యం కాదని, రాష్ట్ర, దేశభవిష్యత్తులు అత్యంత ప్రధానమనే విషయం మరో సారి స్పష్టమైందని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on December 6, 2022 1:27 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…