టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడును సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడడం ఆసక్తిగా మారింది. అంతేకాదు.. టీడీపీలోనూ ఉత్సాహాన్ని పెంచిందనే చెప్పాలి. తాజాగా జీ20 సదస్సుకు సంబంధించి ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఇది.. ఈ సమావేశానికి పాల్గొన్న వారిని మంత్ర ముగ్ధులను చేసిందనే చెప్పాలి.
చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే పాతికేళ్లకు సంబంధించి ఒక సమగ్ర విజన్ రూపొందించుకోవాలని సూచించారు. అంతేకాదు.. యువ శక్తిని వినియోగించుకుని దేశం పురోభివృద్ధిలో ముందుకు నడవాలని కూడా కోరుకున్నారు. ఇక, సాంకేతిక పరంగా కూడా దూకుడు చూపించాలని అన్నారు. డిజిటల్ యుగంలో మరింత పురోభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని తెలిపారు.
ఈ విషయాలు నిజంగా సమావేశానికి వచ్చిన వారు ఎవరూ కూడా ప్రస్తావించలేదనే చెప్పాలి. దీంతో అందరి దృష్టీ మాజీ సీఎం చంద్రబాబుపైనే పడింది. ఈ విషయంపై ముగ్ధులైన ప్రధాని.. తర్వాత తన ఉపన్యాసంలోనూ.. ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ దిశగా కార్యాచరణకు అందరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. తర్వాత వ్యక్తిగతంగా చంద్రబాబు తో మాట్లాడిన సమయంలోనూ ప్రధాని ఇదే విషయం చెప్పారు.
ఈ పరిణామాలతో ఇప్పటి వరకు ఏపీ అధికార పార్టీ వైసీపీ ఏదైతే చంద్రబాబు పై విమర్శలు చేస్తోందో అవన్నీ తుడిచి పెట్టుకుపోయాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు విజన్కు సాటి రారెవ్వరూ అని వ్యాఖ్యానించారు. ఆయన విజన్ సజీవమని.. చంద్రబాబుకు కేవలం రాజకీయాలే ముఖ్యం కాదని, రాష్ట్ర, దేశభవిష్యత్తులు అత్యంత ప్రధానమనే విషయం మరో సారి స్పష్టమైందని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on December 6, 2022 1:27 pm
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…
ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…