Movie News

దయనీయ స్థితిలో ఆ విలన్

పొన్నాంబళం.. అటు తమిళ ప్రేక్షకులే కాదు, తెలుగు వాళ్లు కూడా అంత సులువుగా మరిచిపోలేని విలన్. 90ల్లో సౌత్ ఇండియాలోనే అత్యంత బిజీగా ఉన్న విలన్లలో అతనొకడు. మరీ లీడ్ విలన్ పాత్రలు చేసేవాడు కాదు కానీ.. హీరో మీద ఎటాక్ చేయించడానికి మెయిన్ విలన్ వాడుకునే రౌడీ పాత్ర అనగానే అందరికీ పొన్నాంబళమే గుర్తుకొచ్చేవాడు.

భయం గొలిపేలా విలనీని పండించడంలో పొన్నాంబళం స్టయిలే వేరుగా ఉండేది. అతడితో హీరోకు ఫైట్ పెడితే సినిమాలో అదో హైలైట్‌గా ఉండేది. తమిళంలో దాదాపు అందరు అగ్ర హీరోలతో పని చేసిన పొన్నాంబళం.. తెలుగులో కూడా చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో తరచుగా కనిపించేవాడు. ఐతే 2000 తర్వాత అతడికి సినిమాలు తగ్గిపోయాయి. నెమ్మదిగా ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయాడు.

ఐతే ఇప్పుడు పొన్నాంబళం మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఇప్పుడు అతను దయనీయ స్థితిలో ఉన్నట్లు తమిళ మీడియా వెల్లడించింది. కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న పొన్నాంబళం.. చికిత్సకు డబ్బుల్లేక అవస్థలు పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. చాలా ఏళ్లుగా సంపాదన లేక, ఆస్తి మొత్తం కరిగిపోయి.. అనారోగ్యంతో పాటు ఆర్థిక సమస్యలూ పెరిగిపోయి.. సాయం కోసం అర్థించే స్థితికి చేరుకున్నాడు పొన్నాంబళం. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ కథానాయకుడు, రాజకీయ నేత కమల్ హాసన్.. పొన్నాంబళంకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

అతడి చికిత్స కోసం సాయం చేస్తానని.. అలాగే పొన్నాంబళం పిల్లల చదువుకు అయ్యే ఖర్చును కూడా తాను భరిస్తానని హామీ ఇచ్చారు. కమల్‌తో పొన్నాంబళం అపూర్వ సహోదరులు, మైకేల్ మదన కామరాజు, భారతీయుడు సహా మరెన్నో సినిమాల్లో నటించాడు. కమల్ స్పందన చూశాక మరింతమంది కోలీవుడ్ సెలబ్రెటీలు పొన్నాంబళంకు సాయం చేయడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నారు.

This post was last modified on July 11, 2020 10:23 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

7 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

7 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

8 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

9 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

9 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

9 hours ago