బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే దీనిపై ఎక్కడా చడీచప్పుడు వినిపించడం లేదు. కనిపించడమూ లేదు. ఎవ్వరూ దీనిపై పెద్దగా స్పందించడమూ లేదు. దీంతో కవిత దీక్ష ఎవరికీ పట్టడం లేదా? అనే చర్చ ఆసక్తిగా మారింది. మరోవైపు పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పక్షంలోనూ రెండు రోజులైనా కూడా ఎక్కడా మాట మాత్రం కూడా స్పందించలేదు.
ఎందుకీ దీక్ష?
ఖమ్మం జిల్లాలోని వెలుగు మట్ల గ్రామంలో ఇళ్లను తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లోనే బీఆర్ఎస్ తరఫున ఆందోళన చేశారు. అయితే దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ అభివృద్ధిలో భాగంగానే ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నామని అన్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని కూడా కోరారు.
ఇక ఆ తర్వాత ఈ వ్యవహారంపై కవిత స్పందించారు. పేదల ఇళ్లను ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తాను నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పారు.
అయితే కవిత ప్రకటనలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె అన్నట్టుగానే నిరాహార దీక్షను ప్రారంభించారు. అయితే ఆమె దీక్షను తొలుత ధర్నా చౌక్లో చేయాలని అనుకున్నా అనుమతి రాలేదు. ట్యాంక్బండ్పై చేయాలని అనుకున్నా నిబంధనలు వర్తించలేదు. దీంతో నేరుగా హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలోనే నిరాహార దీక్షను చేపట్టారు. ఇలా గత రెండు రోజులుగా కవిత నిరాహార దీక్ష చేస్తున్నారు.
బుధవారం నాటికి మూడో రోజుకు ఈ దీక్ష చేరినప్పటికీ అటు ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ స్పందించలేదు. మరోవైపు కవిత దీక్షపై పెద్దగా చర్చ కూడా కనిపించడం లేదు. ఈ పరిణామాలతో ఎవ్వరూ దీనిపై స్పందించకపోవడం గమనార్హం.
ఇక కవిత డిమాండ్ల విషయానికి వస్తే ఖమ్మంలో కూల్చేసిన పేదల ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, వారికి పరిహారంగా సొమ్ములు ఇవ్వాలని కోరుతున్నారు. భవిష్యత్తులో పేదల ఇళ్ల జోలికి పోకుండా ఉండాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on March 11, 2026 4:45 pm
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…
తెలుగులో సినిమా నిర్మాణం పెద్ద జూదంగా మారిపోయిన పరిస్థితి. సక్సెస్ రేట్ రాను రాను పడిపోతోంది. ప్రేక్షకుల నుంచి సంపూర్ణ…
వైసీపీ అధినేత జగన్.. తన సతీమణి భారతితో కలిసి.. యూరప్ పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీబీఐ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ప్రజల మధ్య ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ…