అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన జగన్…అసెంబ్లీ సమావేశాలపై విమర్శలు చేశారు.
ఈ సమావేశాల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అంతా పరనింద…ఆత్మస్తుతి అని సెటైర్లు వేశారు. తన కొడుకు లోకేశ్ కు చంద్రబాబు…చంద్రబాబుకు లోకేశ్…ఆ ఇద్దరికీ పవన్ కల్యాణ్ జాకీలు పెట్టి ఎత్తడం తప్ప జరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో సొంత డబ్బాలు, తప్పుడు ప్రచారాలు తప్ప తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదని అన్నారు. అయితే, జగన్ గత అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు మరిచిపోయినట్లు కనిపిస్తోంది. జగన్ ను పొగిడేందుకు వైసీపీ సభ్యులకు సమయం సరిపోయేది కాదంటే అతిశయోక్తి కాదు.
ఇక, మహిళా సభ్యులైతే జగనన్న అంటూ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించేవారు. ఇక, చంద్రబాబు, లోకేశ్, పవన్ లపై వైసీపీ సభ్యులు బూతులతో విరుచుకుపడుతుంటే జగన్ చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ ఆనందించేవారు.
ఒకవేళ చంద్రబాబు, పవన్, లోకేశ్ ల జాకీలను ఆపాలనుకున్న జగన్ అసెంబ్లీకి వస్తే బాగుండేది కదా. ఘోర పరాభవంతో జగన్ కు మొహం చెల్లకుంటే కనీసం తన 10 మంది ఎమ్మెల్యేలనైనా పంవచ్చు కదా?
గత అసెంబ్ల సమావేశాలను చంద్రబాబు బాయ్ కాట్ చేసినా సరే…టీడీపీ ఎమ్మెల్యేలను సభకు పంపించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఏది ఏమైనా..అసెంబ్లీకి రాకుండా…సమాంతరంగా జగన్ పెడుతున్న ప్రెస్ మీట్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.
This post was last modified on March 11, 2026 4:36 pm
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…