Political News

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన జగన్…అసెంబ్లీ సమావేశాలపై విమర్శలు చేశారు.

ఈ సమావేశాల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అంతా పరనింద…ఆత్మస్తుతి అని సెటైర్లు వేశారు. తన కొడుకు లోకేశ్ కు చంద్రబాబు…చంద్రబాబుకు లోకేశ్…ఆ ఇద్దరికీ పవన్ కల్యాణ్ జాకీలు పెట్టి ఎత్తడం తప్ప జరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో సొంత డబ్బాలు, తప్పుడు ప్రచారాలు తప్ప తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదని అన్నారు. అయితే, జగన్ గత అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు మరిచిపోయినట్లు కనిపిస్తోంది. జగన్ ను పొగిడేందుకు వైసీపీ సభ్యులకు సమయం సరిపోయేది కాదంటే అతిశయోక్తి కాదు.

ఇక, మహిళా సభ్యులైతే జగనన్న అంటూ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించేవారు. ఇక, చంద్రబాబు, లోకేశ్, పవన్ లపై వైసీపీ సభ్యులు బూతులతో విరుచుకుపడుతుంటే జగన్ చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ ఆనందించేవారు.

ఒకవేళ చంద్రబాబు, పవన్, లోకేశ్ ల జాకీలను ఆపాలనుకున్న జగన్ అసెంబ్లీకి వస్తే బాగుండేది కదా. ఘోర పరాభవంతో జగన్ కు మొహం చెల్లకుంటే కనీసం తన 10 మంది ఎమ్మెల్యేలనైనా పంవచ్చు కదా?

గత అసెంబ్ల సమావేశాలను చంద్రబాబు బాయ్ కాట్ చేసినా సరే…టీడీపీ ఎమ్మెల్యేలను సభకు పంపించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఏది ఏమైనా..అసెంబ్లీకి రాకుండా…సమాంతరంగా జగన్ పెడుతున్న ప్రెస్ మీట్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.

This post was last modified on March 11, 2026 4:36 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Jagan

Recent Posts

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…

2 hours ago

కవిత దీక్ష.. ఎవరికీ పట్టట్లేదా?

బీఆర్‌ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…

2 hours ago

సుకుమార్ శిష్యుడికి ‘మెగాస్టార్’ గ్రీన్ సిగ్నల్ ?

కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…

3 hours ago

మల్లారెడ్డికి మళ్ళీ పెళ్లి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…

3 hours ago

విద్యుత్ చార్జీల పెంపుపై చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

అస‌లే వేస‌వి కాలం.. సాధార‌ణ ఇళ్ల‌లో ఫాన్లు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇళ్ల‌లో కూల‌ర్లు, ఆపై త‌ర‌గ‌తుల ఇళ్ల‌లో ఏసీలు క‌నీసంలో క‌నీసం…

3 hours ago

కెమెరామెన్ పేల్చిన ‘విశ్వంభర’ బాంబులు

విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…

4 hours ago