ఒక పెద్ద స్టార్ హీరో కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన అదే స్థాయి అందరికీ దక్కుతుందనుకోవడం అమాయకత్వం. ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి మూలపురుషుడిని మించి కష్టపడాల్సి ఉంటుంది. లేదంటే నాలుగైదేళ్లకు కెరీర్ క్లైమాక్స్ కు వస్తుంది. అలా కాకుండా టాలీవుడ్ స్థాయిని ప్యాన్ ఇండియా లెవెల్ లో గర్వంగా చూపించాలంటే ఇంకెంత చెమట చిందించాలి. దానికి సరైన నిర్వచనమే అభిమానులు ప్రేమగా డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్. 2002లో ఈశ్వర్ తో లాంచ్ చేసినప్పుడు జనంలో తన మీద కృష్ణంరాజు గారి తమ్ముడి కొడుకునే బ్రాండ్ తప్ప ఇంకెలాంటి అభిప్రాయం లేదు. అది అతనికీ తెలుసు.
అందుకే డెబ్యూతోనే మాస్ టచ్ ఉన్న ప్రేమకథ చేయాల్సి వచ్చినా వెనక్కు తగ్గలేదు. రెండో ప్రయత్నం రాఘవేంద్ర దారుణంగా దెబ్బ తిన్నా వర్షంతో బాక్సాఫీస్ కు కొత్త స్టార్ వచ్చాడనే సంకేతం 2004లో ఇచ్చాడు. అడవిరాముడు, చక్రంలు నిరాశపరిచినా రాజమౌళి చేతిలో పడ్డాక ఛత్రపతి ద్వారా ప్రభాస్ లో రియల్ మాస్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. తిరిగి పౌర్ణమి, యోగి, మున్నాలు ఫ్లాప్ బాట పడితే బుజ్జిగాడు, బిల్లాతో మళ్ళీ ఎనర్జీని తెచ్చుకున్నాడు. ఏక్ నిరంజన్ గాయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లు ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింత దగ్గర చేశాయి. రెబల్ డిజాస్టరైనా అందులో స్టయిలింగ్ కి ఫాన్స్ ఉన్నారు.
కొత్త దర్శకుడిని నమ్మి చేసిన మిర్చి గురించి చెప్పేదేముంది. కెరీర్ ఇంత పీక్స్ లో ఉన్నప్పుడు కేవలం జక్కన్న మీద నమ్మకంతో అయిదేళ్ల విలువైన కాలాన్ని బాహుబలి బిగినింగ్, కంక్లూజన్ కోసం త్యాగం చేయడం ప్రభాస్ ని దేశవిదేశాల్లో ప్రేక్షకులకు తిరుగులేని ఫ్యానిజంని కట్టబెట్టింది. తెలుగు సినిమా వందల నుంచి వేల కోట్లకు ఎగబాకింది. ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ లు నిరాశపరచవచ్చు గాక. కానీ ప్రభాస్ కట్టుకున్న సామ్రాజ్యంలో చిన్న ఇటుకను కూడా కదపలేకపోయాయి. అందుకే బాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఆది పురుష్, భారతదేశపు ఖరీదైన చిత్రం ప్రాజెక్ట్ కె అన్నీ తన చేతిలోనే ఉన్నాయి. కెజిఎఫ్ దర్శకుడు వెంటపడినా, కంటెంట్ ని నమ్మి మారుతీ లాంటి డైరెక్టర్ కు ఎస్ చెప్పినా అది డార్లింగ్ కే చెల్లు. అందుకే తన పుట్టినరోజు అందరికీ ఇంత స్పెషల్.
This post was last modified on October 23, 2022 11:37 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…