Political News

ఏపీ మంత్రులకు ఇంటెలిజెన్స్ వార్నింగ్‌!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో ఉన్న సుమారు 13 మంది మంత్రుల‌కు రాష్ట్ర ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చ‌రిక‌లు అందాయి. “మంత్రులూ జాగ్ర‌త్త‌” అని అధికారులు వారిని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరిన‌ట్టు.. ముఖ్య‌మంత్రి కార్యాల‌య వ‌ర్గాల నుంచి మీడియాకు అన‌ధికారిక స‌మాచారం అందింది. వాస్త‌వానికి ఇంటెలిజెన్స్‌.. చెప్పిందంటే.. దీనిలో నిజం లేకుండా అయితే ఉండ‌దు. మ‌రి ఎందుకు మంత్రుల‌ను అంత‌గా అలెర్ట్ చేయాల్సి వ‌చ్చింద‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

విష‌యంలోకి వెళ్తే.. మూడు రాజ‌ధానుల‌కు వైసీపీ నాయ‌కులు.. అధిష్టానం బాట‌లో పయ‌నిస్తున్నారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల నాడి ఎలా ఉందో.. ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో కూడా.. వారు ప‌ట్టించుకోకుండా.. పిడివాదం వినిపిస్తున్నార‌నే వాద‌న ఉంది. ఇక‌, ఈ క్ర‌మంలో.. రాజ‌ధాని రైతులు చేస్తున్న‌ పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా.. అడ్డంకులు సృష్టిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. సాక్షాత్తూ రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ రైతుల్లోకి వెళ్లిపోయి.. వాట‌ర్ బాటిళ్లు విస‌ర‌డం.. వారిని దూషించ‌డం కూడా.. ఇటీవ‌ల వెలుగులోకి వ‌చ్చింది.

మ‌రోవైపు… రైతులు ఇంత‌గా పాద‌యాత్ర చేస్తున్నా.. వైసీపీ మంత్రులు మాత్రం.. తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ.. నోరు పారేసుకుంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఒక విధ‌మైన వ్య‌తిరేక‌త మంత్రులు ఎదుర్కొంటున్నారు. ఇదిలావుంటే.. విశాఖ‌లో జ‌న‌వాణి నిర్వ‌హించేందుకు వ‌చ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను హోట‌ల్ గ‌దికే ప‌రిమితం చేయ‌డం.. ఆయ‌న‌ను అన‌ధికారికంగా నిర్బంధించ‌డం.. జ‌న‌సేన నేత‌ల‌పై కేసులు న‌మోదు చేయ‌డం.. మ‌రింత‌.. వివాదానికి దారితీసింది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ చెప్పు చూపిస్తూ.. వ్యాఖ్యానించ‌డం.. దీనికి వైసీపీ కౌంట‌ర్ ఇవ్వ‌డం..ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధాన్ని పెంచేసింది.

ఈ నేప‌థ్యంలో.. ఒక‌వైపు వైసీపీకి, జ‌న‌సేన‌కు మ‌ధ్య ఉమ్మ‌డి రాజ‌కీయ సంగ్రామం రంజుగా సాగుతుంటే.. ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలో జన‌సేన నాయ‌కులు టెక్కలి నియోజ‌క‌వ‌ర్గం(టీడీపీరాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాదించారు)లో పార్టీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకోగా.. అక్క‌డ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అల‌జ‌డి సృష్టించారు. దీంతో మరింత‌గా రాజ‌కీయం స‌ల‌స‌ల మండుతోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా.. పాద‌యాత్ర చేస్తామ‌ని.. మంత్రులు ప్ర‌క‌టించేందుకు రెడీ అయ్యారు.

ఇలా వ‌రుస ప‌రిణామాల నేప‌థ్యంలో ఇటు ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి ఉత్త‌రాంధ్ర జిల్లాల వ‌ర‌కు రాజ‌కీయం చాలా హాటెక్కింది. దీనినిదృష్టిలో పెట్టుకున్న ఇంటెలిజెన్స్‌.. 13 మంది మంత్రుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసిది. వీరిలో గుడివాడ అమ‌ర్నాథ్‌, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, సీదిరి అప్ప‌ల‌రాజు.. వంటి ఫైర్‌బ్రాండ్లు కూడా ఉన్నారు. వీరిపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు స‌హా.. గుర్తు తెలియ‌నివ్య‌క్తులు దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు హెచ్చ‌రించారు. విన‌తి ప‌త్రాలు ఇచ్చేందుకు వ‌చ్చేవారిగా కానీ, లేదా.. మ‌రో రూపంలో కానీ.. దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఈ మేర‌కు మంత్రుల‌ను హెచ్చ‌రించిన‌ట్టు తెలిసింది.

This post was last modified on October 23, 2022 12:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

41 minutes ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

2 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

3 hours ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

4 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

6 hours ago

బండ్ల గణేష్ చెప్పినట్లే.. బన్నీ వాసు

గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…

6 hours ago