తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు. సినిమాలు చాలా వరకు తగ్గించేయడం వల్ల, కొన్ని వివాదాల వల్ల ఆయన పాపులారిటీ తగ్గింది కానీ.. నటుడిగా ఆయనది గొప్ప స్థాయే. చివరగా ‘సన్నాఫ్ ఇండియా’ అనే పేలవమైన సినిమా చేయడంతో ఆయన మరోసారి బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం ఎదుర్కొన్నారు. అలా అని ఆయనేమీ సినిమాలు మానేయడం లేదు.
మణిరత్నం సినిమా ‘పొన్నియన్ సెల్వన్’లో ఓ కీలక పాత్రతో పలకరించబోతున్న మోహన్ బాబు.. తెలుగులో మళ్లీ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈసారి ఆయన తన ముద్దుల కూతురు లక్ష్మీప్రసన్నతో కలిసి నటించబోతుండటం విశేషం. తన తండ్రితో తాను స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయాన్ని పరోక్షంగా రెండు రోజుల కిందటే వెల్లడించిన లక్ష్మి.. ఈ రోజు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
‘‘ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. నటిగా ఈ రంగంలోకి వస్తాననే నేనెప్పుడూ కలగనలేదు. అలాంటిది ఈ రోజు మా నాన్నతో కలిసి ఓ సినిమాలో నటించే అవకాశం లభించింది. మేమిద్దరం కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి ‘అగ్నినక్షత్రం’ అనే టైటిల్ను అధికారికంగా ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విమర్శలు, ట్రోల్స్ గురించి అసలు పట్టించుకోకుండా మీ హృదయం చెప్పింది విని అడుగులు ముందుకు వేయండి’’ అని ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది లక్ష్మి.
లక్ష్మి-మోహన్ బాబు కలిసి నటిస్తున్న చిత్రాన్ని ప్రతీక్ ప్రజోష్ అనే కొత్త దర్శకుడు రూపొందించనున్నాడు. టైటిల్ మోషన్ పోస్టర్ను బట్టి చూస్తే ఇదొక పోలీస్ స్టోరీలా కనిపిస్తోంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ చూడొచ్చనిపిస్తోంది. మోహన్ బాబు-లక్ష్మీ ఇందులో ఒకరినొకరు ఢీకొట్టే పాత్రల్లో కనిపిస్తారని అంటున్నారు. మరి ఈ తండ్రీ కూతుళ్ల పోరు తెరపై ఎంత బాగా పండుతుందో.. ఈ చిత్రానికి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
This post was last modified on July 2, 2022 8:56 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…