ప్రతి సారీ జనవరి 1న ఎన్నో ఆశలు, అంచనాలు, కలలతో కొత్త ఏడాదిని ఆరంభిస్తాం. నూతన సంవత్సరం కొందరికి బాగా కలిసొస్తుంది. కొందరికి నిరాశ కలిగిస్తుంది. మధ్యలో కొన్ని ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ.. ఏడాది చివరి వరకు మంచి రోజుల కోసం చూస్తూ సాగిపోతాం. కానీ 2020 అలాంటి ఆశలేమీ మిగిల్చే అవకాశం కనిపించడం లేదు.
బహుశా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందిని కష్టపెట్టిన సంవత్సరంగా 2020 ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందేమో. కరోనా దెబ్బకు ప్రపంచంలో 80 శాతం మందికి పైగా నష్టాలు చవిచూస్తున్నారు. దీని వల్ల జీవితాలే తలకిందులైపోతున్నాయి. జీవితాలే ఆగిపోతున్నాయి కూడా.
సినీ రంగం ఈ మహమ్మారి ధాటికి ఎంతగా అల్లాడుతుందో చూస్తున్నాం. అది చాలదన్నట్లు వివిధ కారణాలతో ఈ ఏడాది వరుసగా సినీ ప్రముఖులు ప్రాణాలు విడుస్తుండటం అభిమానుల్ని విషాదంలో ముంచెత్తుతోంది.
ఈ ఏడాది చనిపోయిన వాళ్లందరూ హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లే. ముందు అలాంటి సంకేతాలేమీ కూడా కనిపించలేదు. క్యాన్సర్తో రెండేళ్లుగా పోరాడుతూ.. కొంచెం కోలుకుని ఒక సినిమా కూడా చేసిన ఇర్ఫాన్ ఖాన్ కొన్ని నెలల కిందటే ప్రాణాలు విడిచాడు.
ఆ విషాదం నుంచి తేరుకోక ముందే రిషి కపూర్ కన్నుమూశాడు. ఈ దిగ్గజ నటులకు కనీసం ఘనమైన నివాళి కూడా అందించే అవకాశం లేకుండా చేసింది కరోనా. 20 మందికి మించకుండా సన్నిహితులు వీరి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.
ఇంతలో పెద్దగా వయసు లేని సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్.. కరోనాతో కన్నుమూశాడు. ఇక దక్షిణాది విషయానికి వస్తే.. కొన్ని రోజుల కిందట అర్జున్ మేనల్లుడు, హీరోయిన్ మేఘనా రాజ్ భర్త అయిన నటుడు చిరంజీవి సర్జా హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసి కోట్ల మందిని విషాదంలో ముంచెత్తాడు.
ఆ విషాదం మరువకముందే ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడటం పెద్ద షాక్. వీళ్లు కాక మరికొందరు చిన్న స్థాయి సినీ వ్యక్తులు ఈ ఏడాదే చనిపోయారు. ఈ వరుస విషాదాలు చూస్తుంటే 2020 సినిమా వాళ్లపై ఇంతగా కక్ష కట్టిందేంటి.. ఇంకా ఈ ఏడాది ఇలాంటి విషాదాలు ఎన్ని చూడాలో అన్న ఆందోళన నెలకొంటోంది.
బాహుబలి సినిమాను అప్పట్లో టాలీవుడ్ను మించి బాలీవుడ్యే ఎక్కువగా మోసింది. అందుక్కారణం అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఆ చిత్రాన్ని…
టాలీవుడ్లో కొన్నేళ్లుగా సినిమాల మేకింగ్ బాగా ఆలస్యం అవుతోంది. ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయక, దాన్ని మార్చకుండా చెప్పిన…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించాలని భావిస్తున్న…
టాలీవుడ్ అగ్ర నిర్మాత సి అశ్వినీదత్ ఇవాళ ఎమోషనల్ అయ్యారు. సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
జెన్ జీ యుగంలో యువత ఎక్కడికి పోతోందో?… ఏమేం చేస్తుందోనన్న విషయాలపై అంతు చిక్కడం లేదని చెప్పాలి. ఏదో ఒక…
తమిళ రాజకీయాలు దేశవ్యాప్తంగా అమితాసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి దూకిన తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి మొన్నటి…