మహానటి – బయోపిక్లు ఎలా తీయాలి? అనే ప్రశ్నకు తెరెత్తు సమాధానంగా నిలిచింది మహానటి. ఆ సినిమాలో అన్ని విభాగాలూ… మనసు పెట్టి పనిచేశాయి. అందుకే… సావిత్రమ్మకి మళ్లీ ప్రాణం పోసి, తన కథని కళ్లకు కట్టినట్టుగా చూసే అదృష్టం తెలుగువారికి దక్కింది. మహానటి తరవాత మళ్లీ బయోపిక్లు తీయనని దర్శకుడు నాగ అశ్విన్ తేల్చేశాడు. ఇలాంటి మైల్ స్టోన్ జీవితానికి ఒక్కటి చాలు కదా..?
ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే మాట అంటోంది. మహానటితో జాతీయ ఉత్తమ నటి అనిపించుకున్న కీర్తి సురేష్కి… ఆ తరవాత బయోపిక్ అవకాశాలు వరుస కట్టాయి. చాలా కథలు ఆమెను వెదుక్కుంటూ వెళ్లాయి. ఒకట్రెండు బయోపిక్ ప్రాజెక్టులు ఆమె దగ్గర ఉన్నాయని టాలీవుడ్ టాక్. కానీ… అవేం నిజం కాదని తేల్చేసింది కీర్తి.
”నా జీవితంలో ఒకే ఒక్క బయోపిక్ ఉంది. అదే.. మహానటి. అలాంటి సినిమా జీవితానికి ఒక్కటి చాలు కదా. ఇకముందు బయోపిక్లు చేయను. ఆ ఉద్దేశం నాకు లేదు” అని తేల్చేసింది. ప్రస్తుతం నితిన్తో రంగ్దే చేస్తోంది. తాను నటించిన ‘పెంగ్విన్’ ఈనెల 19న నేరుగా అమేజాన్ ప్రైమ్లో విడుదల అవుతోంది. మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉంది. అది తన ఖాతాలో వేసుకుంటే… మరో గోల్డెన్ ఛాన్స్కొట్టేసినట్టే.
This post was last modified on June 16, 2020 3:53 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో…