Movie News

అలాంటి సినిమా జీవితానికి ఒక్క‌టి చాలు

మ‌హాన‌టి – బ‌యోపిక్‌లు ఎలా తీయాలి? అనే ప్ర‌శ్న‌కు తెరెత్తు స‌మాధానంగా నిలిచింది మ‌హాన‌టి. ఆ సినిమాలో అన్ని విభాగాలూ… మ‌న‌సు పెట్టి ప‌నిచేశాయి. అందుకే… సావిత్ర‌మ్మ‌కి మ‌ళ్లీ ప్రాణం పోసి, త‌న క‌థ‌ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూసే అదృష్టం తెలుగువారికి ద‌క్కింది. మ‌హాన‌టి త‌ర‌వాత మ‌ళ్లీ బ‌యోపిక్‌లు తీయ‌న‌ని ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్ తేల్చేశాడు. ఇలాంటి మైల్ స్టోన్ జీవితానికి ఒక్క‌టి చాలు క‌దా..?

ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే మాట అంటోంది. మ‌హాన‌టితో జాతీయ ఉత్త‌మ న‌టి అనిపించుకున్న కీర్తి సురేష్‌కి… ఆ త‌ర‌వాత బ‌యోపిక్ అవ‌కాశాలు వ‌రుస క‌ట్టాయి. చాలా క‌థ‌లు ఆమెను వెదుక్కుంటూ వెళ్లాయి. ఒక‌ట్రెండు బ‌యోపిక్ ప్రాజెక్టులు ఆమె ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని టాలీవుడ్ టాక్‌. కానీ… అవేం నిజం కాద‌ని తేల్చేసింది కీర్తి.

”నా జీవితంలో ఒకే ఒక్క బ‌యోపిక్ ఉంది. అదే.. మ‌హాన‌టి. అలాంటి సినిమా జీవితానికి ఒక్క‌టి చాలు క‌దా. ఇక‌ముందు బ‌యోపిక్‌లు చేయ‌ను. ఆ ఉద్దేశం నాకు లేదు” అని తేల్చేసింది. ప్ర‌స్తుతం నితిన్‌తో రంగ్‌దే చేస్తోంది. తాను న‌టించిన ‘పెంగ్విన్‌’ ఈనెల 19న నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌ల అవుతోంది. మ‌హేష్ బాబు ‘స‌ర్కారువారి పాట‌’ సినిమాలో క‌థానాయిక‌గా కీర్తి సురేష్ పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. అది త‌న ఖాతాలో వేసుకుంటే… మ‌రో గోల్డెన్ ఛాన్స్‌కొట్టేసిన‌ట్టే.

This post was last modified on June 16, 2020 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మైత్రీ తో సినిమా తీయ్.. బాలీవుడ్‌లో పాగా వెయ్!

తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్లో సినిమాలు తీశారు.…

15 minutes ago

ఆ ఎమ్మెల్యే… అధిష్ఠానాన్నే ధిక్కరిస్తున్నారే!

ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…

58 minutes ago

ఎమ్మెల్యే పుత్రుడు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు

ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…

2 hours ago

SSMB 29 : ఊహకందని స్థాయిలో రాజమౌళి స్కెచ్!

మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…

2 hours ago

ఉప ఎన్నికలకు సిద్ఘమంటున్న కేటీఆర్

తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…

2 hours ago

ఆ చేప రేటు 3.95 లక్షలు.. ఎందుకంటే…

కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్‌లో…

3 hours ago