మహానటి – బయోపిక్లు ఎలా తీయాలి? అనే ప్రశ్నకు తెరెత్తు సమాధానంగా నిలిచింది మహానటి. ఆ సినిమాలో అన్ని విభాగాలూ… మనసు పెట్టి పనిచేశాయి. అందుకే… సావిత్రమ్మకి మళ్లీ ప్రాణం పోసి, తన కథని కళ్లకు కట్టినట్టుగా చూసే అదృష్టం తెలుగువారికి దక్కింది. మహానటి తరవాత మళ్లీ బయోపిక్లు తీయనని దర్శకుడు నాగ అశ్విన్ తేల్చేశాడు. ఇలాంటి మైల్ స్టోన్ జీవితానికి ఒక్కటి చాలు కదా..?
ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే మాట అంటోంది. మహానటితో జాతీయ ఉత్తమ నటి అనిపించుకున్న కీర్తి సురేష్కి… ఆ తరవాత బయోపిక్ అవకాశాలు వరుస కట్టాయి. చాలా కథలు ఆమెను వెదుక్కుంటూ వెళ్లాయి. ఒకట్రెండు బయోపిక్ ప్రాజెక్టులు ఆమె దగ్గర ఉన్నాయని టాలీవుడ్ టాక్. కానీ… అవేం నిజం కాదని తేల్చేసింది కీర్తి.
”నా జీవితంలో ఒకే ఒక్క బయోపిక్ ఉంది. అదే.. మహానటి. అలాంటి సినిమా జీవితానికి ఒక్కటి చాలు కదా. ఇకముందు బయోపిక్లు చేయను. ఆ ఉద్దేశం నాకు లేదు” అని తేల్చేసింది. ప్రస్తుతం నితిన్తో రంగ్దే చేస్తోంది. తాను నటించిన ‘పెంగ్విన్’ ఈనెల 19న నేరుగా అమేజాన్ ప్రైమ్లో విడుదల అవుతోంది. మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉంది. అది తన ఖాతాలో వేసుకుంటే… మరో గోల్డెన్ ఛాన్స్కొట్టేసినట్టే.
This post was last modified on June 16, 2020 3:53 pm
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…