మహానటి – బయోపిక్లు ఎలా తీయాలి? అనే ప్రశ్నకు తెరెత్తు సమాధానంగా నిలిచింది మహానటి. ఆ సినిమాలో అన్ని విభాగాలూ… మనసు పెట్టి పనిచేశాయి. అందుకే… సావిత్రమ్మకి మళ్లీ ప్రాణం పోసి, తన కథని కళ్లకు కట్టినట్టుగా చూసే అదృష్టం తెలుగువారికి దక్కింది. మహానటి తరవాత మళ్లీ బయోపిక్లు తీయనని దర్శకుడు నాగ అశ్విన్ తేల్చేశాడు. ఇలాంటి మైల్ స్టోన్ జీవితానికి ఒక్కటి చాలు కదా..?
ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే మాట అంటోంది. మహానటితో జాతీయ ఉత్తమ నటి అనిపించుకున్న కీర్తి సురేష్కి… ఆ తరవాత బయోపిక్ అవకాశాలు వరుస కట్టాయి. చాలా కథలు ఆమెను వెదుక్కుంటూ వెళ్లాయి. ఒకట్రెండు బయోపిక్ ప్రాజెక్టులు ఆమె దగ్గర ఉన్నాయని టాలీవుడ్ టాక్. కానీ… అవేం నిజం కాదని తేల్చేసింది కీర్తి.
”నా జీవితంలో ఒకే ఒక్క బయోపిక్ ఉంది. అదే.. మహానటి. అలాంటి సినిమా జీవితానికి ఒక్కటి చాలు కదా. ఇకముందు బయోపిక్లు చేయను. ఆ ఉద్దేశం నాకు లేదు” అని తేల్చేసింది. ప్రస్తుతం నితిన్తో రంగ్దే చేస్తోంది. తాను నటించిన ‘పెంగ్విన్’ ఈనెల 19న నేరుగా అమేజాన్ ప్రైమ్లో విడుదల అవుతోంది. మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉంది. అది తన ఖాతాలో వేసుకుంటే… మరో గోల్డెన్ ఛాన్స్కొట్టేసినట్టే.
This post was last modified on June 16, 2020 3:53 pm
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…
గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…