మహానటి – బయోపిక్లు ఎలా తీయాలి? అనే ప్రశ్నకు తెరెత్తు సమాధానంగా నిలిచింది మహానటి. ఆ సినిమాలో అన్ని విభాగాలూ… మనసు పెట్టి పనిచేశాయి. అందుకే… సావిత్రమ్మకి మళ్లీ ప్రాణం పోసి, తన కథని కళ్లకు కట్టినట్టుగా చూసే అదృష్టం తెలుగువారికి దక్కింది. మహానటి తరవాత మళ్లీ బయోపిక్లు తీయనని దర్శకుడు నాగ అశ్విన్ తేల్చేశాడు. ఇలాంటి మైల్ స్టోన్ జీవితానికి ఒక్కటి చాలు కదా..?
ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే మాట అంటోంది. మహానటితో జాతీయ ఉత్తమ నటి అనిపించుకున్న కీర్తి సురేష్కి… ఆ తరవాత బయోపిక్ అవకాశాలు వరుస కట్టాయి. చాలా కథలు ఆమెను వెదుక్కుంటూ వెళ్లాయి. ఒకట్రెండు బయోపిక్ ప్రాజెక్టులు ఆమె దగ్గర ఉన్నాయని టాలీవుడ్ టాక్. కానీ… అవేం నిజం కాదని తేల్చేసింది కీర్తి.
”నా జీవితంలో ఒకే ఒక్క బయోపిక్ ఉంది. అదే.. మహానటి. అలాంటి సినిమా జీవితానికి ఒక్కటి చాలు కదా. ఇకముందు బయోపిక్లు చేయను. ఆ ఉద్దేశం నాకు లేదు” అని తేల్చేసింది. ప్రస్తుతం నితిన్తో రంగ్దే చేస్తోంది. తాను నటించిన ‘పెంగ్విన్’ ఈనెల 19న నేరుగా అమేజాన్ ప్రైమ్లో విడుదల అవుతోంది. మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉంది. అది తన ఖాతాలో వేసుకుంటే… మరో గోల్డెన్ ఛాన్స్కొట్టేసినట్టే.
This post was last modified on June 16, 2020 3:53 pm
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…