Movie News

సుశాంత్‌ను వేదనకు గురి చేసిన ఆ రెండు సినిమాలు

నటుడిగా మంచి గుర్తింపు సాధించి, స్టార్ ఇమేజ్ కూడా సాధించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడటం కోట్లాది మందిని షాక్‌కు గురి చేసింది. అతణ్ని అంతగా వేధిస్తున్న సమస్యలేంటన్న ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. వ్యక్తిగత సమస్యలకు తోడు.. సినిమాల సంబంధిత ఇబ్బందులు కూడా అతను ఎదుర్కొంటూ ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్కువగా వారసులతో నిండిపోయిన బాలీవుడ్‌లో సుశాంత్ ఒంటరివాడైపోయాడని.. అతణ్ని తోటి నటీనటులు, టెక్నీషియన్లు ఆదరించట్లేదని.. అందరూ కలిసి అతడి శోకాన్ని పెంచారని అంటున్నారు. రెండు సినిమాల విషయంలో అతను ఎంతో వేదన ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. అందులో ఒకటి శేఖర్ కపూర్ డైరెక్ట్ చేయాల్సి ఉండి ఆగిపోయిన ‘పానీ’ కాగా.. ఇంకోటి కొన్ని నెలల కిందటే డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ‘డ్రైవ్’.

హాలీవుడ్లోనూ మంచి పేరు సంపాదించిన శేఖర్ కపూర్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా యశ్ రాజ్ ఫిిలిమ్స్ ‘పానీ’ సినిమాను నిర్మించాలని కొన్నేళ్ల కిందటే సన్నాహాలు చేసింది. దీని కోసం సుశాంతో ఎంతో కష్టపడి సిద్ధమయ్యాడు కూడా. కానీ అనివార్య కారణాలతో అది ఆగిపోయింది. దీంతో సుశాంత్ ఎంతో ఆవేదన చెందాడని శేఖర్ ఇప్పుడు స్వయంగా చెప్పడం గమనార్హం.

మరోవైపు ‘డ్రైవ్’ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలని సుశాంత్ ఆశించగా.. నిర్మాత కరణ్ జోహార్ అతడి విన్నపాన్ని పట్టించుకోకుండా ఓటీటీలో (లాక్ డౌన్ కంటే ముందే) రిలీజ్ చేసేశాడు. ఇది అతణ్ని బాధించినట్లు చెబుతున్నారు. సుశాంత్ మృతి నేపథ్యంలో శేఖర్ కపూర్ చేసిన ట్వీట్‌ను బట్టి చూస్తే సినీ రంగంలో అతడికి చేదు అనుభవాలున్నాయని స్పష్టమవుతోంది.

‘‘సుశాంత్.. నువ్వు పడ్డ ఆవేదన నాకు తెలుసు. నిన్ను దారుణంగా హింసించిన వారి గురించి నాకు తెలుసు. నువ్వు బాధపడుతూ నా భుజాలపై పడి కన్నీరు పెట్టుకున్నావు. గత ఆరు నెలలు నేను నీ దగ్గర ఉండుంటే బాగుండేది. నువ్వు నన్ను కలిసుంటే బాగుండేది. నీకు ఇలా జరగడం వాళ్ల కర్మ. నీది కాదు’’ అంటూ శేఖర్ చేసిన ట్వీట్ అనుమానాల్ని పెంచేదే.

This post was last modified on June 16, 2020 2:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

3 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

4 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

5 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

5 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

5 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

6 hours ago