బ్యాగ్రౌండ్ ఏమీ లేని.. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న కొత్త హీరో సినిమాకు క్రేజ్ రావడం.. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరగడం.. రిలీజ్ రోజు హౌస్ ఫుల్స్ పడటం అరుదైన విషయం. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమా విషయంలో ఇదే జరిగింది. ‘రాజా వారు రాణి వారు’ సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రెండో సినిమా ఇది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన రెండు మంచి పాటలు రిలీజ్ చేయడం.. యూత్కు నచ్చేలా టీజర్ కట్ చేయడం ద్వారా ఈ సినిమాకు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అయింది.
గత ఏడాదే పూర్తయిన ఈ చిత్రం కోసం ఎప్పట్నుంచో జనాలు ఎదురు చూస్తున్నారు. మధ్యలో ఓటీటీ ఆఫర్లు వచ్చినా కాదనుకుని.. థియేటర్లలో రిలీజ్ చేయడానికి రెడీ అయింది టీం. ఈ కాన్ఫిడెన్స్ చూసి ఈ సినిమా గట్టిగానే కొట్టబోతుందనే అభిప్రాయాలు కలిగాయి.
ఈ శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం పెద్ద స్థాయిలోనే సినిమాను రిలీజ్ చేశారు. మార్నింగ్ షోలు చాలా చోట్ల ఫుల్ అయ్యాయి. థియేటర్లలో మంచి సందడి కనిపించింది. ఐతే సినిమా ఆరంభంలో కనిపించిన ఊపు ముందుకు సాగే కొద్దీ లేకపోయింది. చాలా సాధారణమైన కథ.. బిగి లేని స్క్రీన్ ప్లే.. మామూలు సన్నివేశాలు సినిమా గ్రాఫ్ను తగ్గించేశాయి. ఫస్టాఫ్లో ఎంటర్టైన్మెంట్ వర్కవుట్ అయినా.. ముందుకు సాగే కొద్దీ సినిమా నీరసం వచ్చేసింది ప్రేక్షకులకు. ప్రి క్లైమాక్స్లో తండ్రీ-కొడుకుల బంధం నేపథ్యంలో ఎమోషన్ పిండటానికి ప్రయత్నించారు కానీ అదంత వర్కవుట్ కాలేదు. ఓవరాల్గా సినిమా నిరాశకు గురి చేసింది. ఓ చిన్న సినిమాకు ఇంత క్రేజ్ వచ్చి కూడా దాన్ని అది ఉపయోగించుకోలేకపోయింది.
లాక్ డౌన్ బ్రేక్లో సినిమా చూసుకుని సర్దుబాట్లు చేసుకుని ఉంటే.. ఇంకొంచెం టైం తీసుకుని రీషూట్లు చేసుకుని ఉంటే.. ఎడిటింగ్ మీద శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకు స్పందన మరో రకంగా ఉండేది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి ఉంటే హీరో కిరణ్ దశ తిరిగిపోయేది. కొంత మేర స్టార్ ఇమేజ్ కూడా వచ్చేది. అతను మంచి ఛాన్స్ మిస్సయ్యాడనే చెప్పాలి.
This post was last modified on August 8, 2021 11:52 am
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…