అటు సూర్య‌…. ఇటు శౌర్య‌

ఉప్పెన సినిమా ఎలా ఉంటుందో? హీరోగా వైష్ణ‌వ్ తేజ్ కెరీర్ సంగ‌తేంటో.. తెలీదు గానీ, క‌థానాయిక‌గా కృతి శెట్టి మ‌రో మ‌రో రెండేళ్లు ఈ టాలీవుడ్ ని ఏలేయ‌డం ఖాయం. ఆ సినిమా ఫ‌లితంతో సంబంధం లేకుండా.. గంపెడు అవ‌కాశాల్ని అందేసుకుంటోంది కృతి శెట్టి. ఇప్ప‌టికే నాని సినిమాలో హీరోయిన్ గా బుక్క‌యిపోయింది. ఇప్పుడు అఖిల్ – సురేంద‌ర్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా త‌న‌కే ఛాన్స్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

అంతే కాదు.. నాగ‌శౌర్య హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోబోతోంద‌ని, అందులో.. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని స‌మాచారం అందుతోంది. త‌మిళ సినిమా దృష్టి కూడా కృతిపై ప‌డింద‌ని, సూర్య సినిమాలో క‌థానాయిక‌గా కృతి ఎంపికైపోయింద‌ని ఓ ప్ర‌చారం సాగుతోంది.

అందులో ఎంత వ‌ర‌కూ నిజం ఉందో తెలీదు గానీ.. 2021కి సంబంధించిన కృతి డైరీ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిన‌ట్టే. ఉప్పెన గ‌నుక సూప‌ర్ హిట్ట‌యిపోయ‌తే.. 2022 కాల్షీట్లూ ఇప్పుడే ఇచ్చేయాల్సి ఉంటుంది.