ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది హీరోయిన్ దీపికా పదుకునే. ఆమెను తప్పించి యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రిని తీసుకోవడం ముంబై వర్గాలను సైతం షాక్ కు గురి చేసింది. స్టార్ హీరోయిన్ స్థానంలో ఒక అప్ కమింగ్ ఆర్టిస్టుని తీసుకోవడం ద్వారా సందీప్ పెద్ద ఛాలెంజ్ స్వీకరించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా సందీప్ సోదరుడు ప్రణయ్ వంగా దీని గురించి ఓపెన్ అయ్యారు.
దీపికా పదుకునే డిమాండ్లు తాళలేకే ఆమెను వదులుకున్నట్టు కుండబద్దలు కొట్టేశారు. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. పారితోషికంతో పాటు లాభాల్లో పది శాతం అదనంగా డిమాండ్ చేయడమే కాకుండా.. పని గంటలు ఆరుకి మించకూడదని పెట్టిన కండీషన్లు సందీప్ వంగాని వేరే ఆప్షన్ వైపు మళ్ళించాయని క్లారిటీ ఇచ్చారు. షూట్ కు ముందు ఈ పాత్ర కోసం ఏడాదిన్నర దీపికాతో ట్రావెల్ చేసిన స్పిరిట్ సృష్టికర్త సరైన నిర్ణయమే తీసుకున్నారు.
వాస్తవంగా చెప్పాలంటే బాలీవుడ్ హీరోయిన్ల డిమాండ్లకు మరీ తలొగ్గాల్సిన అవసరం లేదు. సౌత్ లో ఎంత మంచి అవకాశాలు వస్తాయో, బ్రేక్ దక్కితే కెరీర్ ఎలా పుంజుకుంటుందో అక్కడ చాలా మందికి తెలుసు. కియారా అద్వానీ, కృతి సనన్, జాన్వీ కపూర్ లాంటి ఎందరో ఇక్కడ మర్చిపోలేని హిట్స్ అందుకున్నారు. దీపికా పదుకునే కల్కి 2 విషయంలోనూ బెట్టు చేసి దర్శకుడు నాగ్ అశ్విన్ ని సైతం వేరే ఛాయస్ కు వెళ్లిపోయేలా చేయడం అభిమానులు ఇంకా మర్చిపోలేదు.
సందీప్ వంగా ఇక్కడ నష్టపోయింది ఏమి లేదు. దీపికా లేనంత మాత్రాన కథలో ఇంటెన్సిటీ తగ్గదు. తను కోరుకున్న అవుట్ ఫుట్ మారదు. యానిమల్ లో రష్మిక మందన్నని తీసుకునే సమయానికి తనకు హిందీలో వరస ఫ్లాపులు ఉన్నాయి. అయినా ఏమయ్యింది. పెద్ద బ్రేక్ అందుకుని బిజీగా మారిపోయింది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో కియారా కోరి మరీ ప్రాణం పెట్టి నటించింది. ఇదంతా ఏమో కానీ అల్లు అర్జున్ రాకాకు ఇలాంటి కండీషన్లు ఒప్పుకునే అట్లీ ఆమెతో ఓకే చేయించుకున్నారా. ఏమో మరి.
This post was last modified on August 20, 2026 10:26 pm
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…
నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…
ఈనెల 17 వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో…