ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే కెరీర్ ముందుకు సాగదు. ఐతే ఫలితాలతో సంబంధం లేకుండా కొందరికి మాత్రం వరుసగా అవకాశాలు వస్తాయి. భాగ్యశ్రీ బోర్సే ఈ కోవకే చెందుతుంది. దక్షిణాదిన తన తొలి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. తర్వాత ఆమె నటించిన కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా కూడా నిరాశపరిచాయి.
అయినా భాగ్యశ్రీకి అవకాశాలేమీ ఆగిపోలేదు. తెలుగులో ‘లెనిన్’, తమిళంలో ‘సెయాన్’ చిత్రాల్లో ఛాన్సులు అందుకుంది. ఇందులో ‘లెనిన్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎబోవ్ యావరేజ్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే సాధిస్తోంది. ఈ చిత్రంలో గ్లామర్తో ఆకట్టుకోవడమే కాక.. నటనలోనూ ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా భాగ్యశ్రీ పెర్ఫామెన్స్ను పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో భాగ్యశ్రీ ‘లెనిన్’ సక్సెస్ మీట్లో చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇప్పటిదాకా హిట్టు కొట్టకపోయినా తన మీద అభిమానులు అమితమైన ప్రేమ చూపించడం.. ఇప్పుడు ‘లెనిన్’లో తన పాత్రకు మంచి స్పందన వస్తుండడం ఆమెను తీవ్ర భావోద్వేగానికి గురి చేసినట్లే కనిపిస్తోంది. ‘లెనిన్’ ఈవెంట్లో మాట్లాడే క్రమంలో ఆమె కన్నీళ్లు పెట్టేసుకుంది. మాట తడబడుతుండగా.. గత ఏడాదిన్నరగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన జర్నీ గురించి గుర్తు చేసుకుంది భాగ్యశ్రీ.
అభిమానులు తన మీద చూపించే ప్రేమ, వాళ్లు పంపించే మెసేజ్లు.. తన సినిమాలకు సంబంధించిన రీల్స్ గురించి చెబుతుండగా భాగ్యశ్రీకి కన్నీళ్లు ఆగలేదు. చివరగా ఒక మాట చెబుతా అంటూ.. హైదరాబాాద్ను తన కర్మభూమిగా అభివర్ణించింది భాగ్యశ్రీ. అంతేకాక తన చివరి చిత్రం తెలుగులోనే చేస్తానని కూడా ఆమె స్పష్టం చేసింది. రెండేళ్ల కెరీర్లో ఎప్పుడూ చలాకీగానే కనిపించిన భాగ్యశ్రీ ఇంత ఎమోషనల్ అవడం.. హైదరాబాద్ గురించి, తెలుగు సినిమాల గురించి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…
బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…
ఇటీవలే జీ ఫైవ్ లో నేరుగా విడుదలైన సట్లెజ్ సినిమా రెండు రోజుల తర్వాత తీసేయాల్సి రావడం మీద మీడియా,…