జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర చికిత్సకు ఏకంగా 3.5 గంటల సమయం పట్టింది. ఏళ్ల క్రితం అయిన గాయాలకు సంబంధించి పవన్ చాలా కాలంగా విపరీతమైన నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. 2018లో రెండు భుజాలకు గాయాలు కాగా… వాటికి సంబంధించిన చికిత్సను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే వాటిని మరింత కాలం వాయిదా వేయడం ప్రమాదమన్న వైద్యుల సూచనలతో తాజాగా ఆపరేషన్ చేయించుకున్నారు.
ఇటీవలే ముక్కుకు చేయించుకున్న శస్త్ర చికిత్స సందర్భంగా భుజాలకు ఉన్న గాయాలను ముంబై వైద్యులు గుర్తించారు. విపరీతమైన నొప్పి ఉన్న ఆ గాయాలను ఇంతకాలం ఎలా భరించారంటూ వైద్యులు పవన్ ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రెండు భుజాలకు అయిన గాయాలకు తక్షణమే చికిత్స చేయించుకోవాలని, లేని పక్షంలో ప్రమాదమేనని వైద్యులు సూచించారు. అయితే అప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో ఖరారైన పలు కార్యక్రమాలను వాయిదా వేయడం ఇష్టంలేని పవన్… వైద్యులు చెప్పినా… ఆపరేషన్ ను వాయిదా వేశారు. తాజాగా శుక్రవారం ముంబై వెళ్లి… ఆపరేషన్ చేయించుకున్నారు.
శనివారం జరిగిన ఆపరేషన్ లో కుడి భుజానికి మాత్రమే శస్త్ర చికిత్స జరిగింది. రొటేటర్ కఫ్ గాయానికి జరిగిన ఈ చికీత్సకు ఏకంగా 3.5 గంటల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. శనివారం నాటి ఆపరేషన్ లో కేవలం కుడి భుజానికి మాత్రమే చికిత్స జరగగా… ఎడమ భుజానికి రెండు నెలల్లోగా ఆపరేషన్ చేయాల్సి ఉంది. రెండు భుజాలకూ ఒకే సారి ఆపరేషన్ చేస్తే ఆ నొప్పి తీవ్రంగా ఉంటుందని, ఆ నొప్పిని భరించడం సాధ్యం కాదన్న భావనతోనే వైద్యులు ప్రస్తుతానికి ఒక్క భుజానికి మాత్రమే ఆపరేషన్ చేశారు. అంటే… రెండు నెలల్లోగా మరోమారు ముంబై వెళ్లి ఎడమ భుజానికి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
పవన్ కు ఆపరేషన్ విజయవంతం అయిన తీరుపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు ఆపరేషన్ సక్సెస్ అయిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయన ఓ సందేశాన్ని విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సందేశాలు విడుదల చేస్తున్నారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ హర్షం ప్రకటించారు.
This post was last modified on July 11, 2026 2:50 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…