బాలీవుడ్ లో స్పై డ్రామాలకు గడ్డు కాలం వచ్చేసింది. దురంధర్ పుణ్యమాని ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు పెట్టి నమ్మిస్తామంటే ప్రేక్షకులు అంగీకరించడం లేదు. యష్ రాజ్ సంస్థకు ఇది బాగా అనుభవమవుతోంది. టైగర్ 3 ఊహించని విధంగా ఫ్లాప్ కాగా వార్ 2 వేసిన దెబ్బ అంతా ఇంతా కాదు. హృతిక్ తారక్ ఇమేజులు కొంత కాపాడాయి కానీ లేదంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. తాజాగా విడుదల చేసిన అల్ఫా దారుణంగా దెబ్బ తింది. విమర్శకులు విరుచుకు పడ్డారు.
ఇదంతా ఇప్పుడు నిర్మాణంలో ఉన్న పలు స్పై డ్రామా సినిమాల మీద ప్రభావం చూపిస్తోంది. వాటిలో అడవి శేష్ గూఢచారి 2 ఉంది. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అయ్యాక దాని సీక్వెల్ కోసం చాలా కాలం నుంచి మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. దర్శకుడు మారినా సరే సీక్వెల్ క్రేజ్ తగ్గదనే నమ్మకంతో నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. డెకాయిట్ కోసం దానికి బ్రేక్ ఇచ్చిన శేష్ ఇటీవలే షూటింగ్ రీ స్టార్ట్ చేశాడు. దాదాపు సగంపైనే పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్.
ఒకవేళ అడవి శేష్ దురంధర్ తరహాలో ఆర్గానిక్ మేకింగ్ తో కనక ఆకట్టుకుంటే మేజర్ తరహాలో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ జానర్ ని సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగితే నార్త్ జనాలు కనకవర్షం కురిపిస్తారు. కాకపోతే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. మేజర్ ఎంత సక్సెస్ అయినా శేష్ కి ఉత్తరాదిలో భారీ ఫాలోయింగ్ లేదు. డెకాయిట్ ఎంత పుష్ చేసినా హిందీలో ఆడలేదు. కారణం అలాంటి సెటప్ ఉన్న సినిమాలు చాలా చూసేశారు కాబట్టి.
సో ఇప్పుడు గూఢచారి 2తో ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ సైడ్ టాక్ అయితే చాలా పాజిటివ్ గా వినిపిస్తోంది. మొదటి భాగానికి పదింతలు రిచ్ విజువల్స్, టేకింగ్ తో తెరకెక్కుతోందని, ఖచ్చితంగా ఆడియన్స్ థ్రిల్ అవుతారని అంటున్నారు. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న గూఢచారి 2 అనౌన్స్ మెంట్ వచ్చి మూడు సంవత్సరాలు దాటేసింది. ఈ ఏడాది రిలీజ్ అవుతుందో లేదో ఇంకా స్పష్టత రావలసి ఉంది.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…