జనసేన నాయకులకు ఆ పార్టీ అధినేత చెబితే చెవికి ఎక్కడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వాలని.. ఎప్పటికప్పుడు వారు చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో సహా తిప్పికొట్టాలని పవన్ కల్యాణ్.. గత రెండు నెలల కాలంలో మూడు సార్లు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు కూడా ఇదే సూచన చేశారు.
కానీ, ఒకరిద్దరు మాత్రమే స్పందిస్తున్నారు. పోనీ.. ఇలా స్పందించిన వారైనా సక్రమంగా కౌంటర్ ఇస్తున్నారా? అంటే.. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ.. వైసీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరో రచ్చకు దారితీశాయి. దీనిపై పవన్ కల్యాణ్ మరోసారి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దీనికి తోడు ఇప్పటికే ఉన్న సమస్యలతో పాటు కొత్తవి పుట్టుకొచ్చాయి. తాజాగా `రావణ్` అరెస్టు, ఉపా కేసు వంటివి రచ్చ రేపుతున్నాయి.
సోషల్ మీడియాలో జనసేన అధినేతను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, ఇటు వైపు నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కౌంటర్ ఇవ్వడం లేదు. మళ్లీ సైలెంట్ అయిపోయారు. దీంతో వైసీపీ చేస్తున్న ప్రచారానికి వస్తున్న ఇమేజ్.. జనసేన వైపు నుంచి ఎలాంటి ప్రచారం లేకపోవడంతో అదే నిజమని నమ్మే పరిస్థితి వచ్చింది. తాజాగా పవన్ కల్యాణ్ మరోసారి దిద్దుబాటు చర్యలకు దిగారు. నాయకులకు ఈ సారి ఘాటుగానే క్లాస్ ఇవ్వనున్నారు.
ఇదిలావుంటే.. మిత్రపక్షం టీడీపీలో ఉన్న వ్యవస్థ జనసేనలో లేదన్నట్టుగానే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబును ఎవరైనా ఏదైనా అంటే.. జిల్లాలు, నియోజకవర్గాలతో సంబంధం లేకుండా.. పదవులతో కూడా సంబంధం లేకుండా నాయకులు మీడియా ముందుకు వస్తారు. కౌంటర్లపై కౌంటర్లు ఇస్తారు. ప్రత్యర్థులు చేసిన వ్యాఖ్యలకు నాలుగింతలు ముట్టజెపుతారు. తిరిగి చంద్రబాబు జోక్యం చేసుకుని ఇక చాల్లే అంటే తప్ప.. ఆగరు. అలాంటి పరిస్థితి జనసేనలో లేకపోవడం గమనార్హం.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…