పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో. ఒక టైంలో ఒకవైపు రాజకీయాలు, ఇంకోవైపు సినిమాలను మేనేజ్ చేయలేక పవన్ బాగా ఇబ్బంది పడడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాక చాలా కష్టపడి టైం సర్దుబాటు చేసుకుని ఆయన తాను పెండింగ్లో పెట్టిన మూడు సినిమాలను పూర్తి చేశారు. వాటిలో ముందుగా హరిహర వీరమల్లు.. తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకదాని తర్వాత ఒకటి రిలీజయ్యాయి.
దీంతో పవన్ రిలాక్స్ అయ్యారు. ఇక ఆయన్నుంచి ఇప్పుడిప్పుడే సినిమాలు రావని అంతా అనుకున్నారు. కానీ ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి, రామ్ తాళ్ళూరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు పవన్. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన కూాడా ఇచ్చారు. ఇదే పవన్ నెక్స్ట్ మూవీ అవుతుందని అనుకున్నారు.
కానీ అనూహ్యంగా మధ్యలో ‘ఓజీ-2’ తెరపైకి వచ్చింది. నిజానికి దర్శకుడు సుజీత్.. ఇప్పుడు నానితో ‘బ్లడీ రోమియో’ చేస్తుండాల్సింది. కానీ ‘ది ప్యారడైజ్’ ఆలస్యం కావడంతో నాని అందుబాటులోకి రాలేదు. దీంతో సుజీత్ దృష్టి ‘ఓజీ-2’ మీదికి మళ్లింది.
కానీ ఆ చిత్రం పెద్ద స్థాయిలో తీయాల్సిన నేపథ్యంలో అంత తేలిగ్గా ముందుకు కదలకపోవచ్చనే అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ‘ఓజీ-2’ పనులు మొదలుపెట్టింది టీం. పవన్, సుజీత్ కథా చర్చలు జరుపుతున్న ఫొటో కూడా బయటికి రావడంతో ఈ సినిమా త్వరలోనే ముందుకు కదలబోతోందని అర్థమైంది.
మరిప్పుడు సురేందర్ సినిమా సంగతేంటన్నదే అర్థం కావడం లేదు. ఈ చిత్రం ఈపాటికే మొదలుకావాల్సింది. కానీ పవన్ను సంతృప్తి పరిచేలా స్క్రిప్టు రెడీ కాలేదని, అందుకే ఆలస్యం అని గతంలో వార్తలు వచ్చాయి. పవన్ ఇప్పుడు ‘ఓజీ-2’ను టేకప్ చేయాలని చూస్తుండడంతో సూరి సినిమా మళ్లీ అటకెక్కేస్తుందా.. అసలా సినిమా ఉంటుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అసలు ఉండదనుకున్న సినిమాకు పవన్ పచ్చజెండా ఊపినపుడు.. వీలైనంత త్వరగా పర్ఫెక్ట్ స్క్రిప్టుతో రెడీ అవ్వాల్సింది సూరి అండ్ టీం. కానీ ఆ పని చేయలేకపోవడంతో ఇప్పుడీ చిత్రం మీద నీలినీడలు కమ్ముకున్న పరిస్థితి. కాకపోతే తనకు వ్యక్తిగతంగా, జనసేన కోసం ఎంతో చేసిన రామ్ తాళ్ళూరి కోసం ఇంకొంత ఆలస్యంగా అయినా పవన్ ఈ సినిమా చేసే అవకాశముంది. కాకపోతే ముందు పవన్కు నచ్చే స్క్రిప్టుతో సూరి రావాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…