తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, అనుకోని ఘటనల కారణంగా ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతుండటం కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతోంది.
తాజాగా తెలంగాణలోని మహబూబ్నగర్కు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయి రెడ్డి బొల్లెండుల అమెరికాలో కన్నుమూశాడు. ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన అరుణ్, అక్కడ STEM OPTపై ఉంటూ పూర్తి స్థాయి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
అయితే అనారోగ్య కారణాలతో అతను మరణించినట్లు సమాచారం. ఈ విషాద వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంతో ఆశలతో విదేశాలకు వెళ్లిన కుమారుడు ఇలా అకాల మరణం చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రస్తుతం అరుణ్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు స్నేహితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతదేహం భారత్కు చేరుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
This post was last modified on June 22, 2026 7:56 am
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…