తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, అనుకోని ఘటనల కారణంగా ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతుండటం కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతోంది.
తాజాగా తెలంగాణలోని మహబూబ్నగర్కు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయి రెడ్డి బొల్లెండుల అమెరికాలో కన్నుమూశాడు. ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన అరుణ్, అక్కడ STEM OPTపై ఉంటూ పూర్తి స్థాయి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
అయితే అనారోగ్య కారణాలతో అతను మరణించినట్లు సమాచారం. ఈ విషాద వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంతో ఆశలతో విదేశాలకు వెళ్లిన కుమారుడు ఇలా అకాల మరణం చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రస్తుతం అరుణ్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు స్నేహితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతదేహం భారత్కు చేరుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…