తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, అనుకోని ఘటనల కారణంగా ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతుండటం కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతోంది.
తాజాగా తెలంగాణలోని మహబూబ్నగర్కు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయి రెడ్డి బొల్లెండుల అమెరికాలో కన్నుమూశాడు. ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన అరుణ్, అక్కడ STEM OPTపై ఉంటూ పూర్తి స్థాయి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
అయితే అనారోగ్య కారణాలతో అతను మరణించినట్లు సమాచారం. ఈ విషాద వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంతో ఆశలతో విదేశాలకు వెళ్లిన కుమారుడు ఇలా అకాల మరణం చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రస్తుతం అరుణ్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు స్నేహితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతదేహం భారత్కు చేరుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…