గత వారం రోజులుగా ఓజి 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందని, దర్శకుడు సుజిత్ అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు నాని బ్లడీ రోమియో కోసం కూడా సుజిత్ సిద్ధమవుతున్నట్టు ఇంకో వార్త చక్కర్లు కొడుతోంది. కమిట్ మెంట్స్ వరస ప్రకారం చూస్తే న్యాచురల్ స్టార్ మూవీనే ముందు స్టార్ట్ అవ్వాలి. అయితే ప్యారడైజ్ ఆలస్యం వల్ల ఓజి 2 పేరు హఠాత్తుగా తెరమీదకు వచ్చింది.
ఇవాళ అరుదైన వ్యాధి బారిన పడిన తన అభిమాని నిరంజన్ ను కలుసుకునేందుకు వరంగల్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆ అబ్బాయితో మంచి సమయం గడపటం జనాన్ని ఆకట్టుకుంటోంది. ఏదో మొక్కుబడిగా కనిపించేసి, రెందు మాటలు చెప్పేసి బయటికి రాలేదు. వాళ్ళకు తృప్తి అనిపించే దాకా అక్కడే ఉండి, యోగక్షేమాలు కనుక్కుని, ఏమేం కావాలో గుర్తు పెట్టుకుని, అన్నీ నెరవేరుస్తానని వీడియోల సాక్షిగా హామీ ఇవ్వడం అభిమానుల మనసులు గెలుచుకుంది.
ఇదిలా ఉండగా నిరంజన్ తో జరిపిన ముచ్చట్లలో భాగంగా పవన్ కళ్యాణ్ ఓజి 2 ప్రస్తావన తెచ్చారు. అది తీస్తే దాని ఈవెంట్ కి నిన్ను ప్రత్యేక అతిథిగా పిలుస్తానని చెప్పడమే కాదు సినిమా కూడా కలిసి చూద్దాం అన్న తరహాలో ప్రామిస్ చేయడం చూసి అతని తల్లితండ్రులకు ఆనంద బాష్పాలు వచ్చినంత పనయ్యింది. ఆ అబ్బాయి కళ్ళలో కూడా ఆ సంతోషం తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపించాయి. అందరిలోనూ ఉద్వేగం కనిపించింది.
ఈ లెక్కన ఓజి 2 ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో తెరకెక్కడం ఖాయమని చెప్పొచ్చు. కాకపోతే సుజిత్ ఈ ఏడాదే తీస్తాడా లేక బ్లాడీ రోమియో పూర్తి చేసుకుని వస్తాడా అనేది ఇంకా వేచి చూడాలి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఓజి 2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ కు సమయం అందుబాటులోనే ఉంది కానీ అనారోగ్యం దృష్ట్యా వెంటనే సెట్స్ పైకి వెళ్లే సాహసం చేయకపోవచ్చు. ఏదైతేనేం ఇంకో ఏడాదిలోనో లేదా అటుపైనో ఓజి 2 రావడం అయితే పక్కా.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కు ఇండియాలోనూ వీర ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు అర్థమైనా కాకపోయినా కల్ట్ మేకింగ్…
సినిమాల సక్సెస్ రేట్ పడిపోతోందని.. ఒకప్పట్లా జనం థియేటర్లకు రావట్లేదని ఈ మధ్య మన ఇండస్ట్రీలో తరచుగా ఆవేదన స్వరం…
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…