సినిమాల సక్సెస్ రేట్ పడిపోతోందని.. ఒకప్పట్లా జనం థియేటర్లకు రావట్లేదని ఈ మధ్య మన ఇండస్ట్రీలో తరచుగా ఆవేదన స్వరం వినిపిస్తున్నారు ఫిలిం మేకర్స్. పొరుగు ఇండస్ట్రీ అయిన కోలీవుడ్.. అలాగే దేశంలోనే అతి పెద్ద ఫిలిం ఇండస్ట్రీ అయిన బాలీవుడ్లోనూ పరిస్థితులు ఏమంత గొప్పగా లేవు. కన్నడ సినీ పరిశ్రమ పరిస్థితీ అంతంతమాత్రమే. కానీ మలయాళంలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నం.
అక్కడి సినిమాల విస్తృతి పెరుగుతోంది. సక్సెస్ రేట్ కూడా తక్కువేమీ కాదు. తక్కువ బడ్జెట్లో, బలమైన కంటెంట్తో మలయాళ ఫిలిం మేకర్స్ తీసే సినిమాలు థియేటర్లలో విజయవంతం కావడంతో పాటు ఓటీటీల్లోనూ అద్భుత ఆదరణ దక్కించుకుంటున్నాయి. డివైడ్ టాక్ తెచ్చుకున్న దృశ్యం-3 సినిమా కూడా ఈ ఏడాది ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. దీంతో ఇతర భాషల నుంచి హీరోలు, నిర్మాతలు మాలీవుడ్ వైపు చూస్తున్నారు.
సూర్య ప్రస్తుతం జీతు మాధవన్ అనే మలయాళ దర్శకుడితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్తో పాటు షైన్ స్క్రీన్స్ మలయాళంలో ఏఆర్ఎం, వాళ-2 సినిమాలు నిర్మించి మంచి ఫలితాలను అందుకున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. తన ధర్మ ప్రొడక్షన్స్ను మలయాళంలోకి తీసుకెళ్తున్నాడు. అతను మాలీవుడ్ అగ్ర కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్తో చేతులు కలుపుతున్నాడు.
వీళ్లిద్దరూ కలిసి నిర్మించే ఒడియన్ అనే సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించనున్నాడు. రాహుల్.. భూతకాలం, భ్రమయుగం లాంటి వెరైటీ హార్రర్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఒడియన్ కూడా హార్రర్ టచ్ ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది. ఇందులో పృథ్వీరాజ్, మంజువారియర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. హిందీలో వరుసగా షాక్లు తింటున్న కరణ్.. సక్సెస్ కోసం మలయాళంలోకి అడుగు పెడుతున్నట్లున్నాడు. మరి మంచి ఊపుమీదున్న మాలీవుడ్ అతడికి మంచి విజయాన్నందిస్తుందేమో చూడాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కు ఇండియాలోనూ వీర ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు అర్థమైనా కాకపోయినా కల్ట్ మేకింగ్…
గత వారం రోజులుగా ఓజి 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందని,…
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…