Movie News

లాక్కుపోతున్న మ‌లయాళం సినిమా


సినిమాల స‌క్సెస్ రేట్ ప‌డిపోతోందని.. ఒక‌ప్ప‌ట్లా జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌ట్లేద‌ని ఈ మ‌ధ్య మ‌న ఇండ‌స్ట్రీలో త‌ర‌చుగా ఆవేద‌న స్వ‌రం వినిపిస్తున్నారు ఫిలిం మేక‌ర్స్. పొరుగు ఇండ‌స్ట్రీ అయిన కోలీవుడ్.. అలాగే దేశంలోనే అతి పెద్ద ఫిలిం ఇండ‌స్ట్రీ అయిన బాలీవుడ్లోనూ ప‌రిస్థితులు ఏమంత గొప్ప‌గా లేవు. క‌న్న‌డ సినీ ప‌రిశ్రమ ప‌రిస్థితీ అంతంత‌మాత్ర‌మే. కానీ మ‌ల‌యాళంలో మాత్రం ప‌రిస్థితులు పూర్తి భిన్నం.

అక్క‌డి సినిమాల విస్తృతి పెరుగుతోంది. స‌క్సెస్ రేట్ కూడా త‌క్కువేమీ కాదు. త‌క్కువ బ‌డ్జెట్లో, బ‌ల‌మైన కంటెంట్‌తో మ‌లయాళ ఫిలిం మేక‌ర్స్ తీసే సినిమాలు థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతం కావ‌డంతో పాటు ఓటీటీల్లోనూ అద్భుత ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటున్నాయి. డివైడ్ టాక్ తెచ్చుకున్న దృశ్యం-3 సినిమా కూడా ఈ ఏడాది ఎంత పెద్ద హిట్ట‌యిందో తెలిసిందే. దీంతో ఇత‌ర భాష‌ల నుంచి హీరోలు, నిర్మాత‌లు మాలీవుడ్ వైపు చూస్తున్నారు.

సూర్య ప్ర‌స్తుతం జీతు మాధ‌వ‌న్ అనే మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో పాటు షైన్ స్క్రీన్స్ మ‌లయాళంలో ఏఆర్ఎం, వాళ‌-2 సినిమాలు నిర్మించి మంచి ఫ‌లితాల‌ను అందుకున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్.. త‌న ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌ను మ‌ల‌యాళంలోకి తీసుకెళ్తున్నాడు. అత‌ను మాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత పృథ్వీరాజ్ సుకుమార‌న్‌తో చేతులు క‌లుపుతున్నాడు.

వీళ్లిద్ద‌రూ క‌లిసి నిర్మించే ఒడియ‌న్ అనే సినిమాకు రాహుల్ స‌దాశివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. రాహుల్.. భూత‌కాలం, భ్ర‌మ‌యుగం లాంటి వెరైటీ హార్ర‌ర్ సినిమాల‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఒడియ‌న్ కూడా హార్ర‌ర్ ట‌చ్ ఉన్న సినిమాలాగే క‌నిపిస్తోంది. ఇందులో పృథ్వీరాజ్, మంజువారియ‌ర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. హిందీలో వ‌రుస‌గా షాక్‌లు తింటున్న క‌ర‌ణ్‌.. స‌క్సెస్ కోసం మ‌ల‌యాళంలోకి అడుగు పెడుతున్న‌ట్లున్నాడు. మ‌రి మంచి ఊపుమీదున్న మాలీవుడ్ అత‌డికి మంచి విజ‌యాన్నందిస్తుందేమో చూడాలి.

This post was last modified on June 17, 2026 2:25 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

4 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

5 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

5 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

6 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

7 hours ago