టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎంకు అపర భక్తుడనని చెప్పుకుంటూ ఉంటారు. ఈ మాట ముమ్మాటికీ నిజమనని బండ్ల గణేశ్ తన తాజా చర్యతో మరోమారు నిరూపించుకున్నారు. హన్మకొండకు చెందిన తన వీరాభిమాని నిరంజన్ ను పవన్ పరామర్శిస్తే… అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న నిరంజన్ కు బండ్ల గణేశ్ ఏకంగా రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా బండ్ల గణేశ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. తన నేతృత్వంలోని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నుంచి నిరంజన్ కుటుంబాన్ని ఆదుకునే దిశగా రూ.5 లక్షల సాయాన్ని ఇవ్వనున్నట్లు సదరు ప్రకటనలో బండ్ల గణేశ్ ప్రకటించారు. ఈ ప్రకటనలో నిరంజన్ అనారోగ్యం, అతడి కుటుంబ దీనావస్థను ప్రస్తావించిన గణేశ్…ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు పవన్ చొరవ చూపిన విధానాన్ని ప్రత్యేకంగా కీర్తించారు.
ఇక తన ప్రకటనలో తనను తాను పవన్ భక్తుడనని కూడా గణేశ్ పేర్కొనడం గమనార్హం. “పవన్ కల్యాణ్ గారి భక్తుడిగా ఆయన స్ఫూర్తితో నిరంజన్ కు, అతడి కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నాను” అంటూ గణేశ్ పేర్కొన్నారు. నిరంజన్ కోరికను తీర్చేందుకు పవన్ హన్మకొండకు బయటుదేరిన వెంటనే గణేశ్ ఈ ప్రకటనను విడుదల చేశారు.
పవన్ ను తన అభిమాన నటుడిగా పేర్కొన్న నిరంజన్… ఆయనను ఓసారి కలవాలనుకుంటున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్ బుధవారం నేరుగా హన్మకొండ వెళ్లి మరీ నిరంజన్ ను కలిశారు. ఈ సందర్భంగా నిరంజన్ కుటుంబానికి పవన్ రూ.1 లక్ష సాయాన్ని అందించారు. అదే సమయంలో పవన్ బాటలో నడిచిన గణేశ్ కూడా నిరంజన్ కుటుంబానికి రూ.5 లక్షల సాయాన్ని ప్రకటించారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…
వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…
సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు…
వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…
విజయ్ దేవరకొండ కెరీర్లో ఇప్పటిదాకా అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా అంటే.. ‘లైగర్’యే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ…