టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎంకు అపర భక్తుడనని చెప్పుకుంటూ ఉంటారు. ఈ మాట ముమ్మాటికీ నిజమనని బండ్ల గణేశ్ తన తాజా చర్యతో మరోమారు నిరూపించుకున్నారు. హన్మకొండకు చెందిన తన వీరాభిమాని నిరంజన్ ను పవన్ పరామర్శిస్తే… అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న నిరంజన్ కు బండ్ల గణేశ్ ఏకంగా రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా బండ్ల గణేశ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. తన నేతృత్వంలోని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నుంచి నిరంజన్ కుటుంబాన్ని ఆదుకునే దిశగా రూ.5 లక్షల సాయాన్ని ఇవ్వనున్నట్లు సదరు ప్రకటనలో బండ్ల గణేశ్ ప్రకటించారు. ఈ ప్రకటనలో నిరంజన్ అనారోగ్యం, అతడి కుటుంబ దీనావస్థను ప్రస్తావించిన గణేశ్…ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు పవన్ చొరవ చూపిన విధానాన్ని ప్రత్యేకంగా కీర్తించారు.
ఇక తన ప్రకటనలో తనను తాను పవన్ భక్తుడనని కూడా గణేశ్ పేర్కొనడం గమనార్హం. “పవన్ కల్యాణ్ గారి భక్తుడిగా ఆయన స్ఫూర్తితో నిరంజన్ కు, అతడి కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నాను” అంటూ గణేశ్ పేర్కొన్నారు. నిరంజన్ కోరికను తీర్చేందుకు పవన్ హన్మకొండకు బయటుదేరిన వెంటనే గణేశ్ ఈ ప్రకటనను విడుదల చేశారు.
పవన్ ను తన అభిమాన నటుడిగా పేర్కొన్న నిరంజన్… ఆయనను ఓసారి కలవాలనుకుంటున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్ బుధవారం నేరుగా హన్మకొండ వెళ్లి మరీ నిరంజన్ ను కలిశారు. ఈ సందర్భంగా నిరంజన్ కుటుంబానికి పవన్ రూ.1 లక్ష సాయాన్ని అందించారు. అదే సమయంలో పవన్ బాటలో నడిచిన గణేశ్ కూడా నిరంజన్ కుటుంబానికి రూ.5 లక్షల సాయాన్ని ప్రకటించారు.
This post was last modified on June 17, 2026 2:26 pm
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…