గత కొంత కాలంగా కనిపించడం మానేసిన నివేత పేతురాజ్ మళ్ళీ బిజీ అయ్యేలా ఉంది. ఇటీవలే వెంకటేష్ ఆదర్శ కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర దక్కించుకున్న సంగతి తెలిసిందే. టీమ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు కానీ షూటింగ్ లో ఆల్రెడీ చేరిపోయిందని సమాచారం. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ తరహాలో క్యారెక్టర్ అంటున్నారు కానీ దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. నివేత పేతురాజ్ గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో నటించడం విదితమే.
లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ అమ్మడికి ఇంకో మెగా ఆఫర్ వచ్చిందట. చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మాఫియా యాక్షన్ డ్రామాలో నివేత పేతురాజ్ కి అవకాశం దక్కిందని వినికిడి. దీనికి కూడా అధికారిక ధ్రువీకరణ లేదు కానీ ఫిలిం నగర్ వర్గాలు బలంగానే చెబుతున్నాయి. పాత్ర తాలూకు డీటెయిల్స్ అంతగా లేవు కానీ జర్నలిస్ట్ తరహాలో ఉంటుందని అంటున్నారు. ఏదైనా చిరంజీవి మూవీ అంటే ఈ పరిస్థితుల్లో లక్కీ లాటరీ అని చెప్పాలి.
వీటిలో ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2 విడుదలకు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ ఇంకా మీడియా, అభిమానులకు కన్ఫర్మ్ చేయలేదు కానీ దానికి అనుగుణంగానే వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతిని వదులుకోరు. పట్టుబట్టి మరీ పూర్తి చేస్తారు. ఎలాగూ వెంకీ సహకారం ఉంటుంది కనక అదేమీ అసాధ్యం కాదు. నివేత డేట్లు మరీ ఎక్కువ అవసరం లేకపోవడంతో ఆగస్ట్ కల్లా తన భాగం పూర్తవుతుందని అంటున్నారు.
చిరంజీవి బాబీ మూవీకి మాత్రం కొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది. ఇటీవలే ప్రారంభోత్సవం చేసి మరుసటి రోజే అవుట్ డోర్ కి వెళ్లిపోయారు. ఇందులో మెగాస్టార్ భార్యగా ప్రియమణి, కూతురిగా అనస్వర రాజన్ కనిపించనున్నారు. మరి నివేతకిచ్చిన క్యారెక్టర్ వర్తమానంలో ఉంటుందా లేక ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందానేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆ మధ్య వ్యక్తిగత కారణాల వల్ల మీడియాకు కూడా కనిపించకుండా వెళ్ళిపోయిన నివేత ఇకపై కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుందేమో చూడాలి.
This post was last modified on May 26, 2026 5:43 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…