సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు మూడు రోజులు తర్జన భర్జన పడినప్పటికీ ఫైనల్ గా చెప్పిన డేట్ కే థియేటర్లకు తీసుకొస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. సూర్యతో పాటు తమ్ముడు కార్తీ గెస్టుగా వచ్చారు. తెలుగు మార్కెట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టే ఈ బ్రదర్స్ ఈసారి టైం ఎక్కువ లేకపోవడంతో ఒక వేడుకతో అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు.
ట్రైలర్ లో కథేంటో చెప్పేసారు. రౌడీల్లాంటి లాయర్లతో కోర్టుని తన కనుసన్నల్లో నడిపించే దుర్మార్గుడు బేబీ కృష్ణ (ఆర్జె బాలాజీ). అమాయకులైన ఒక తండ్రి కూతురుకి న్యాయం చేస్తానని చెప్పి కేసు తీసుకుని మోసం చేస్తాడు. చావే గతి అనుకున్న వాళ్ల కోసం నల్లకోటు వదిలేసిన వీరభద్ర(సూర్య) తిరిగి వస్తాడు. వాదించడమే కాదు నేరం చేస్తే కత్తి పట్టుకుని నరికేసే మనస్తత్వం తనది. మరి బేబీ కృష్ణ ఆగడాలకు ఎలా చెక్ పెట్టాడనేది తెరమీద చూడాలి.
స్టోరీ పరంగా మరీ కొత్తదనం అనిపించదు కానీ జాలీ LLB సిరీస్ ఛాయలు కొన్ని ఉన్నాయి. కాకపోతే మాస్ ట్రీట్ మెంట్ తో పాటు దైవత్వానికి సంబంధించిన అంశాలు జోడించిన ఆర్జె బాలాజీ ఒక సస్పెన్స్ ఎలిమెంట్ మాత్రం ట్రైలర్ లో చూపించకుండా దాచి పెట్టాడు. అదే చివర్లో వచ్చే తెల్లమీసాల పెద్దాయన షాట్ దానికి సంబంధించినదే. సాయి అభ్యంకర్ సంగీతం సమకూర్చిన వీరభద్రుడులో హీరోయిన్ త్రిష. రెండు మూడు సీన్లలో చూపించారు.
ఇంత తక్కువ గ్యాప్ లో వీరభద్రుడు ఓపెనింగ్స్ ఏ స్థాయిలో తెచ్చుకుంటుందో చూడాలి. ఒక అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా తెలుగులో పెద్ద స్టార్ హీరో కమర్షియల్ సినిమా రాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది కానీ డిజాస్టర్ కావడం వల్ల ట్రేడ్ లాభపడలేదు. సో ఆ గ్యాప్ ని కనక వీరభద్రుడు వాడుకుంటే కలెక్షన్లు బాగా వస్తాయి. చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేదు కాబట్టి బాగుందనే టాక్ వస్తే చాలు సూర్యకి హిట్టు పడ్డట్టే.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…