తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కొన్ని రోజుల పాటు నడిచిన డ్రామాకు ఆదివారం తెరపడి, ఆదివారం నాడు తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం అసెంబ్లీలో విజయ్తో పాటు అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
చాలా ఏళ్ల పాటు తమిళ సినీ రంగంలో సహ నటులుగా ఉన్న విజయ్, ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో ప్రభుత్వ అధినేత, ప్రతిపక్ష నేతలుగా ఎలా వ్యవహరిస్తారు.. తొలి రోజు వారి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఐతే ఇద్దరి మధ్య వాతావరణం అంత సానుకూలంగా కనిపించలేదు. ముఖ్యంగా విజయ్ పట్ల ఉదయనిధి వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.
విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో చాలా సమీపంలోనే ఉన్న ఉదయనిధి.. ముఖం ఒక వైపు తిప్పుకుని ఈ వ్యవహారంతో తనకేమీ పట్టనట్లు ఉండిపోయాడు. ఆ సమయంలో అతనంత సీరియస్గా ఉండడం ఆశ్చర్యం కలిగించింది. మరోవైపు ఉదయనిధి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో విజయ్ మాత్రం చిరు మందహాసంతో అతణ్నే చూస్తూ ఉన్నాడు.
కానీ ఉదయనిధి మాత్రం మైక్ దగ్గరికి వచ్చినపుడు కానీ.. ప్రమాణ స్వీకారం చేస్తున్నపుడు, కానీ వెళ్లేటపుడు కానీ విజయ్ వైపే చూడలేదు. అప్పుడు కూడా అతను చాలా గంభీరంగా కనిపించాడు. ప్రతిపక్ష నేతగా విజయ్ను గట్టిగా ఢీకొట్టాలని ఉదయనిధి భావిస్తుండొచ్చు కానీ..
చాలా ఏళ్లు విజయ్ ఉన్న ఫిలిం ఇండస్ట్రీలోనే తానూ ఉన్నాడు కాబట్టి.. సభలో తొలి రోజు కొంచెం నవ్వుతూ, విజయ్తో కలివిడిగా ఉండాల్సిందని.. అతనేదో బద్ధ శత్రువు అయినట్లు ఇప్పుడే ఇంత సీరియస్ అయిపోవాల్సిన అవసరమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఐతే సభలో ఇలా ఉన్న ఉదయనిధి.. విజయ్ వచ్చి తన తండ్రి స్టాలిన్ను కలిసినపుడు మాత్రం అక్కడ మామూలుగానే ఉన్నాడు.
This post was last modified on May 11, 2026 10:15 pm
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…