సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. వారి సినిమాల్లో కొన్ని బాగా ఆడాయి కూడా. తెలుగులో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్లు నటన వైపు అడుగులేసిన దాఖలాలు దాదాపు కనిపించవు. చిన్న చిన్న క్యామియోలు చేయడం తప్పితే సంగీత దర్శకులు పూర్తి స్థాయి హీరోలైన ఉదంతాలు లేవు.
ఐతే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమయ్యాడు. దేవి తెరంగేట్రం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నప్పటకీ.. గత ఏడాదే తన తొలి సినిమా ఖరారైంది. ముందుగా నాని చేస్తాడనుకున్న ‘యల్లమ్మ’ సినిమా… ఆ తర్వాత నితిన్ దగ్గరికి వెళ్లి.. చివరగా దేవిశ్రీ చేతికి చేరింది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. గతంలో అన్నట్లే హీరోగా దేవి తొలి చిత్రాన్ని దిల్ రాజే నిర్మిస్తున్నారు.
‘బలగం’ ఫేమ్ వేణు తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా చిత్రీకరణ ఈ మధ్యే మొదలైంది. నటుడిగా తొలి సినిమాను దేవి అంత తేలిగ్గా ఏమీ తీసుకోవట్లేదు. ఇందుకోసం స్పెషల్ లుక్లోకి మారాడు. అంతే కాక తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని కూడా కొంత కాలం అతను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ‘యల్లమ్మ’కు దేవినే సంగీత దర్శకుడు కానీ.. ఈ సినిమా చేసే సమయంలో సంగీత దర్శకుడిగా వేరే సినిమాలేవీ ఒప్పుకోకూడదని దేవి నిర్ణయించుకున్నాడట.
అందుకే అతను ఏవైనా ప్రపోజల్స్ వచ్చినా తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. దేవి మనసు తెలుసుకుని ఇప్పుడు ఎవరూ అతణ్ని సంప్రదించడం కూడా చేయట్లేదట. నిజానికి దేవిశ్రీ సంగీత ప్రయాణానికి ఇబ్బంది రాకుండా నెలలో 20 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరపాలని, మిగతా పది రోజులు సంగీతం కోసం వదిలేయాలని టీం నిర్ణయించుకుంది. కానీ దేవి మాత్రం కొన్ని నెలల పాటు సంగీతాన్ని పక్కన పెట్టి మరీ ఈ సినిమా చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పుడు తన ఫోకస్ మొత్తం నటన మీదే ఉందట. కొన్ని నెలలు సంగీతానికి బ్రేక్ ఇచ్చి ఈ చిత్రం మీదే దృష్టిపెట్టనున్న దేవి.. ఆ తర్వాత ‘యల్లమ్మ’ మ్యూజిక్ పనులు చూసుకుంటాడట. ఈ సినిమా పని మొత్తం పూర్తయ్యాకే సంగీత దర్శకుడిగా కొత్త ప్రాజెక్టును అంగీకరిస్తాడని.. ఆలోపు వేరే ప్రాజెక్టు వైపు కన్నెత్తి కూడా చూసే అవకాశాలు లేవని సమాచారం.
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…
ఏపీ సీఎం చంద్రబాబు.. గత వారం రోజులుగా మహానాడు నిర్వహణపై దృష్టి పెట్టారు. ఇదేసమయంలో పాలన పరంగా కూడా సమీక్షలు..…
మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…