దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళలేదు. దర్శకుడు వేణు యెల్దండి అన్నీ రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నప్పటికీ అసలైన హీరోయిన్ సమస్య టీమ్ ని వేధిస్తోంది. తాజాగా మృణాల్ ఠాకూర్ ని కలిస్తే సానుకూలంగా స్పందించిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది కానీ అదెంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చే దాకా చెప్పలేం. రాజుగారి బ్యానర్ లోనే మృణాల్ ది ఫ్యామిలీ స్టార్ లో నటించింది.
ఈ ప్రాజెక్టుని దిల్ రాజు ముందు నుంచి ప్రెస్టీజియస్ గా ఫీలవుతున్నారు. అందుకే వేణు అడిగిన భారీ బడ్జెట్ కు ఓకే అన్నారు. ముందు నానికి వినిపించారు. తర్వాత నితిన్ తో ఆల్మోస్ట్ అయ్యిందనుకున్న స్టేజిలో వెనుకడుగు వేశారు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ని సెట్ చేసుకున్నారు. ఇదంతా జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా కొబ్బరికాయ కొట్టకపోవడం పట్ల ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దేవి తరచుగా చెన్నై నుంచి హైదరాబాద్ ట్రిప్పులు కొడుతూనే ఉన్నారట.
గతంలో వివి వినాయక్ ని హీరోగా పరిచయం చేసే ఉద్దేశంతో శీనయ్య అనే సినిమా ప్రకటించారు దిల్ రాజు. అది పోస్టర్ రిలీజ్ చేశాక ఆగిపోయింది. ఇప్పుడు ఎల్లమ్మకు అలా జరగకూడదనే సంకల్పంతో ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేశారు. ఒకవేళ నోటెడ్ హీరోయిన్ సెట్ కాకపోతే కొత్త అమ్మాయిని తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. అయితే ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర కావడంతో ఆ రిస్క్ అంత సులభంగా తీసుకోలేరు.
చాలా ఆలస్యంగా హీరో అవతారం ఎత్తిన దేవిశ్రీ ప్రసాద్ ఇంకోవైపు సినిమాలకు సంగీతం అందించే బాధ్యతను కొనసాగిస్తున్నాడు. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో రూపొందుతున్న సున్ – గీతం వచ్చే నెల రెండో వరంలో విడుదల కానుంది. దాని వర్క్స్ చాలా ఉన్నాయి. పైగా పన్నెండు పాటల ఆల్బమ్. సో ఎల్లమ్మకు మరింత గ్యాప్ రావొచ్చు. ఎవరిని ఫైనల్ చేసినా అప్పుడప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటే జనం నోళ్ళలో సినిమా పేరు నానుతూ ఉంటుంది.
This post was last modified on May 8, 2026 6:39 pm
సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…
ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…
అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ…
బాక్సాఫీస్ కు ఇంకో ఫ్రైడే వచ్చింది. కానీ థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడం లేదు. కారణం స్టార్ క్యాస్టింగ్…
టాలీవుడ్ నిర్మాతలు త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక విన్నపం చేయబోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో ఏపీ తెలంగాణలో ఫ్లెక్సి…
తమిళనాడు రాజకీయాలు మూడు రోజులుగా రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే పార్టీకి ప్రజలు…