దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళలేదు. దర్శకుడు వేణు యెల్దండి అన్నీ రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నప్పటికీ అసలైన హీరోయిన్ సమస్య టీమ్ ని వేధిస్తోంది. తాజాగా మృణాల్ ఠాకూర్ ని కలిస్తే సానుకూలంగా స్పందించిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది కానీ అదెంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చే దాకా చెప్పలేం. రాజుగారి బ్యానర్ లోనే మృణాల్ ది ఫ్యామిలీ స్టార్ లో నటించింది.
ఈ ప్రాజెక్టుని దిల్ రాజు ముందు నుంచి ప్రెస్టీజియస్ గా ఫీలవుతున్నారు. అందుకే వేణు అడిగిన భారీ బడ్జెట్ కు ఓకే అన్నారు. ముందు నానికి వినిపించారు. తర్వాత నితిన్ తో ఆల్మోస్ట్ అయ్యిందనుకున్న స్టేజిలో వెనుకడుగు వేశారు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ని సెట్ చేసుకున్నారు. ఇదంతా జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా కొబ్బరికాయ కొట్టకపోవడం పట్ల ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దేవి తరచుగా చెన్నై నుంచి హైదరాబాద్ ట్రిప్పులు కొడుతూనే ఉన్నారట.
గతంలో వివి వినాయక్ ని హీరోగా పరిచయం చేసే ఉద్దేశంతో శీనయ్య అనే సినిమా ప్రకటించారు దిల్ రాజు. అది పోస్టర్ రిలీజ్ చేశాక ఆగిపోయింది. ఇప్పుడు ఎల్లమ్మకు అలా జరగకూడదనే సంకల్పంతో ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేశారు. ఒకవేళ నోటెడ్ హీరోయిన్ సెట్ కాకపోతే కొత్త అమ్మాయిని తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. అయితే ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర కావడంతో ఆ రిస్క్ అంత సులభంగా తీసుకోలేరు.
చాలా ఆలస్యంగా హీరో అవతారం ఎత్తిన దేవిశ్రీ ప్రసాద్ ఇంకోవైపు సినిమాలకు సంగీతం అందించే బాధ్యతను కొనసాగిస్తున్నాడు. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో రూపొందుతున్న సున్ – గీతం వచ్చే నెల రెండో వరంలో విడుదల కానుంది. దాని వర్క్స్ చాలా ఉన్నాయి. పైగా పన్నెండు పాటల ఆల్బమ్. సో ఎల్లమ్మకు మరింత గ్యాప్ రావొచ్చు. ఎవరిని ఫైనల్ చేసినా అప్పుడప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటే జనం నోళ్ళలో సినిమా పేరు నానుతూ ఉంటుంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…