దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళలేదు. దర్శకుడు వేణు యెల్దండి అన్నీ రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నప్పటికీ అసలైన హీరోయిన్ సమస్య టీమ్ ని వేధిస్తోంది. తాజాగా మృణాల్ ఠాకూర్ ని కలిస్తే సానుకూలంగా స్పందించిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది కానీ అదెంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చే దాకా చెప్పలేం. రాజుగారి బ్యానర్ లోనే మృణాల్ ది ఫ్యామిలీ స్టార్ లో నటించింది.
ఈ ప్రాజెక్టుని దిల్ రాజు ముందు నుంచి ప్రెస్టీజియస్ గా ఫీలవుతున్నారు. అందుకే వేణు అడిగిన భారీ బడ్జెట్ కు ఓకే అన్నారు. ముందు నానికి వినిపించారు. తర్వాత నితిన్ తో ఆల్మోస్ట్ అయ్యిందనుకున్న స్టేజిలో వెనుకడుగు వేశారు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ని సెట్ చేసుకున్నారు. ఇదంతా జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా కొబ్బరికాయ కొట్టకపోవడం పట్ల ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దేవి తరచుగా చెన్నై నుంచి హైదరాబాద్ ట్రిప్పులు కొడుతూనే ఉన్నారట.
గతంలో వివి వినాయక్ ని హీరోగా పరిచయం చేసే ఉద్దేశంతో శీనయ్య అనే సినిమా ప్రకటించారు దిల్ రాజు. అది పోస్టర్ రిలీజ్ చేశాక ఆగిపోయింది. ఇప్పుడు ఎల్లమ్మకు అలా జరగకూడదనే సంకల్పంతో ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేశారు. ఒకవేళ నోటెడ్ హీరోయిన్ సెట్ కాకపోతే కొత్త అమ్మాయిని తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. అయితే ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర కావడంతో ఆ రిస్క్ అంత సులభంగా తీసుకోలేరు.
చాలా ఆలస్యంగా హీరో అవతారం ఎత్తిన దేవిశ్రీ ప్రసాద్ ఇంకోవైపు సినిమాలకు సంగీతం అందించే బాధ్యతను కొనసాగిస్తున్నాడు. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో రూపొందుతున్న సున్ – గీతం వచ్చే నెల రెండో వరంలో విడుదల కానుంది. దాని వర్క్స్ చాలా ఉన్నాయి. పైగా పన్నెండు పాటల ఆల్బమ్. సో ఎల్లమ్మకు మరింత గ్యాప్ రావొచ్చు. ఎవరిని ఫైనల్ చేసినా అప్పుడప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటే జనం నోళ్ళలో సినిమా పేరు నానుతూ ఉంటుంది.
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…
ఏపీ సీఎం చంద్రబాబు.. గత వారం రోజులుగా మహానాడు నిర్వహణపై దృష్టి పెట్టారు. ఇదేసమయంలో పాలన పరంగా కూడా సమీక్షలు..…
మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…