పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన మమతా బెనర్జీ తాజాగా బీజేపీ దెబ్బకు కుదేలయ్యారు. దీదీ ఇలాకలో పాగా వేసేందుకు పదేళ్ళుగా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టకేలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
అయితే బెంగాల్ కు బిజెపి నుంచి కాబోయే తొలి ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంపై మాత్రం సందిగ్ధత ఏర్పడింది. ఒకప్పుడు దీదీ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న సువేందు అధికారి
ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్నారు. అయితే ఆయనకు పోటీగా మరో ఇద్దరు నేతలు కూడా ఉండటంతో బిజెపి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది.
ఆ సందిగ్ధతకు తెరదించుతూ తాజాగా సువేందు అధికారి బెంగాల్ లో బిజెపి తరఫున తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
అమిత్ షా సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. రేపు బెంగాల్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…