పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన మమతా బెనర్జీ తాజాగా బీజేపీ దెబ్బకు కుదేలయ్యారు. దీదీ ఇలాకలో పాగా వేసేందుకు పదేళ్ళుగా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టకేలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
అయితే బెంగాల్ కు బిజెపి నుంచి కాబోయే తొలి ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంపై మాత్రం సందిగ్ధత ఏర్పడింది. ఒకప్పుడు దీదీ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న సువేందు అధికారి
ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్నారు. అయితే ఆయనకు పోటీగా మరో ఇద్దరు నేతలు కూడా ఉండటంతో బిజెపి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది.
ఆ సందిగ్ధతకు తెరదించుతూ తాజాగా సువేందు అధికారి బెంగాల్ లో బిజెపి తరఫున తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
అమిత్ షా సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. రేపు బెంగాల్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
This post was last modified on May 9, 2026 8:50 am
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…