పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన మమతా బెనర్జీ తాజాగా బీజేపీ దెబ్బకు కుదేలయ్యారు. దీదీ ఇలాకలో పాగా వేసేందుకు పదేళ్ళుగా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టకేలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
అయితే బెంగాల్ కు బిజెపి నుంచి కాబోయే తొలి ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంపై మాత్రం సందిగ్ధత ఏర్పడింది. ఒకప్పుడు దీదీ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న సువేందు అధికారి
ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్నారు. అయితే ఆయనకు పోటీగా మరో ఇద్దరు నేతలు కూడా ఉండటంతో బిజెపి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది.
ఆ సందిగ్ధతకు తెరదించుతూ తాజాగా సువేందు అధికారి బెంగాల్ లో బిజెపి తరఫున తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
అమిత్ షా సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. రేపు బెంగాల్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
This post was last modified on May 9, 2026 8:50 am
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…