ఉగాది, రంజాన్ పండగలు లక్ష్యంగా వారం ప్రీ పోన్ చేసుకుని మరీ వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం కళ్ళముందు కనిపించేస్తోంది. నార్త్ అమెరికాలో కనీసం ఒక్క మిలియన్ మార్కు అయినా అందుకుంటుందా లేదానే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఏపీలో అయిదో రోజుకే టికెట్ రేట్లు సాధారణ స్థితికి తేవడం చూస్తే ట్రెండ్ ఎంత డౌన్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మాములుగా కలెక్షన్లను ప్రకటించే మైత్రి సంస్థ ఉస్తాద్ విషయంలో మౌనం పాటిస్తోంది.
సరే ప్రతి ఫలితం మన చేతుల్లో ఉండదు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేస్తూనే ఉండటం విశేషం. బిలో 18 ప్రీ టీనేజర్స్ తో ఛాట్ షో, ఫ్యాన్స్ తో కేకులు కట్ చేయించి సెలబ్రేషన్స్ జరుపుకోవడం, ఎవరు పిలిచినా కాదనకుండా పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం, శ్రీలీల-రాశిఖన్నాడేట్లు తీసుకుని వాళ్ళనూ ప్రచారంలో భాగం చేయడం, ప్రతి పాజిటివ్ ట్వీట్ కు స్పందిస్తూ సోషల్ మీడియాలో రిప్లై ఇవ్వడం, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు అవుతుంది.
ఇప్పటికీ హరీష్ శంకర్ నమ్ముతున్నది ఒకటే. తాను బెస్ట్ ఎంటర్ టైనర్ తీశానని. ఫీడ్ బ్యాక్స్, కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ ఖచ్చితంగా పికప్ అవుతుందనే నమ్మకంతో పబ్లిసిటీ ఆపకుండా చేస్తున్నారు. ఆదివారం ఏదో సక్సెస్ మీట్ అన్నారు కానీ అది జరగలేదు. పవన్ కళ్యాణ్ తిరిగి పాలనలో బిజీ అయిపోవడంతో ప్రత్యేకంగా ఈవెంట్లకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో వీలైతే ఈ వీకెండ్ ఇంకో ఈవెంట్ ఏదైనా సాధ్యమవుతుందేమోనని దర్శక నిర్మాతలు ట్రై చేస్తున్నారు.
లాభ నష్టాల సంగతి పక్కనపెడితే హరీష్ శంకర్ ఇంత నిర్విరామంగా తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం మంచి విషయమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల రిజల్ట్ తెలిసిన మరుక్షణం కొందరు దర్శకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి నెలల తరబడి బయటికి రావడం లేదు. కానీ హరీష్ అలా చేయకుండా తన సినిమాను ఎంత పుష్ చేయాలో అంతకంటే ఎక్కువే ట్రై చేస్తున్నారు. అది పెద్ద ఎత్తున కలెక్షన్లుగా ఏ మేరకు మారుతుందనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.
This post was last modified on March 24, 2026 3:12 pm
భారత దేశంలో కులం, మతం వంటి విషయాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. విద్య, ఉద్యోగం, సామాజిక హోదాలకు కులం, మతం…
రెండున్నర గంటలు ఇండియన్ సినిమాకు స్టాండర్డ్ రన్ టైమ్. కొన్ని సినిమాలకు దాని మీద నిడివి పావుగంట పెరగొచ్చు. కొన్ని చిత్రాలకు…
బాలీవుడ్ హీరోయిన్, చిరుత ఫేమ్ నేహా శర్మ సినిమాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, సోషల్ మీడియా ద్వారా సంపాదనలో మాత్రం…
2019 ఎన్నికల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత, రెండు సంవత్సరాల గ్యాప్ అనంతరం మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవర్…
“ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ హయాంలో కుట్రలు చేశారు. దీనిని శ్మశానం అని గేలి చేశారు” అని సీఎం చంద్రబాబు…
భారతీయ చలనచిత్ర చరిత్రలో మొదటిసారి నాలుగు వేల కోట్లతో రూపొందుతున్న విజువల్ గ్రాండియర్ గా 'రామాయణ' గురించి నిర్మాతలు ఎంత…