రెండున్నర గంటలు ఇండియన్ సినిమాకు స్టాండర్డ్ రన్ టైమ్. కొన్ని సినిమాలకు దాని మీద నిడివి పావుగంట పెరగొచ్చు. కొన్ని చిత్రాలకు తగ్గొచ్చు. ఒకప్పుడు చాలా వరకు రెండున్నర గంటలను మించే రన్ టైం ఉండేది. కానీ మధ్యలో నిడివి తగ్గించడం ట్రెండుగా మారింది. పెద్ద సినిమాలు స్టాండర్డ్ రన్టైమ్లోనే కొనసాగినా.. చిన్న, మీడియం రేంజ్ చిత్రాలు రెండు రెండుంబావు గంటల నిడివికి తగ్గించేయడం కొన్నేళ్ల పాటు జరిగింది. ఇప్పటికీ ఆ నిడివితో సినిమాలు వస్తున్నాయి కానీ.. మిడ్ రేంజ్ చిత్రాలు, పెద్ద సినిమాలకు మాత్రం నిడివి అంతకంతకూ పెరిగిపోతోంది.
ఒక దశలో మూడు గంటల సినిమా అంటే అమ్మో అనుకునేవారు. కానీ అర్జున్ రెడ్డి, రంగస్థలం లాంటి చిత్రాలు మూడు గంటల నిడివితోనూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో రన్ టైం పెరిగినా పర్వాలేదని ఫిలిం మేకర్స్కు ధైర్యం వచ్చింది. ఐతే ఇప్పుడు రన్ టైం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. యానిమల్, పుష్ప-2 చిత్రాలు 3 గంటల 21 నిమిషాల నిడివితో విడుదలై ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాలో విషయం ఉండాలే కానీ.. రన్ టైం అన్నది పెద్ద సమస్యే కాదని ఆ చిత్రాలు రుజువు చేశాయి.
ఐతే ఇప్పుడు నిడివి మూడున్నర గంటలు దాటినా సమస్య లేదని దురంధర్, దురంధర్-2 చిత్రాలు నిరూపించాయి. ‘దురంధర్’ను మూడున్నర గంటల రన్టైంతో రిలీజ్ చేసిన ఆదిత్య ధర్.. పార్ట్-2కు ఇంకా ధీమాగా 3 గంటల 50 నిమిషాల రన్టైంతో ఫైనల్ కట్ రెడీ చేశాడు.
యాడ్స్, ఇంటర్వెల్ బ్రేక్.. ఇవన్నీ కూడా కలుపుకుంటే థియేటర్లలో ప్రేక్షకులు 4 గంటలకు పైగానే కూర్చుంటున్నారు. అయినా సరే ఏమాత్రం విసుగు రావట్లేదు. రోలింగ్ టైటిల్స్ పడుతున్నా సరే.. ఆడియన్స్ సీట్ల నుంచి లేవకుండా స్క్రీన్ క్లోజ్ అయ్యే వరకు ఎదురు చూస్తున్నారంటే ‘దురంధర్-2’ వారిని ఏ స్థాయిలో ఎంగేజ్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.
రన్ టైం విషయంలో ‘దురంధర్’ ఫ్రాంఛైజీ ఫిలిం మేకర్లకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి కంటెంట్ ఉందనే ధీమా ఉంటే నిడివి ఎక్కువే ఉంచేయడానికి ఇకపై ఫిలిం మేకర్స్ వెనుకంజ వేయకపోవచ్చు. రన్ టైం తగ్గించడం కోసం మంచి సీన్లకు కోత పెట్టాల్సిన.. ఏ సీన్లు తీసేయాలా అని తలలు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలా అని ఎంగేజింగ్గా లేని సినిమాలను ఇలా లాంగ్ రన్ టైంతో రిలీజ్ చేస్తే అసలుకే మోసం వస్తుందన్న సంగతి మరువరాదు.
This post was last modified on March 24, 2026 3:18 pm
పశ్చిమ ఆసియాలో జరుగుతున్న అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావం భారత్పై దీర్ఘకాలం ఉండే అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…
న్యూ ఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించిన TV9 నెట్వర్క్ ప్రతిష్టాత్మక ‘What India Thinks…
అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు భారీ స్థాయిలో సీట్లు పెంచాలన్న నిర్ణయం సరైందేనా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.…
భారత దేశంలో కులం, మతం వంటి విషయాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. విద్య, ఉద్యోగం, సామాజిక హోదాలకు కులం, మతం…
ఉగాది, రంజాన్ పండగలు లక్ష్యంగా వారం ప్రీ పోన్ చేసుకుని మరీ వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం కళ్ళముందు…
బాలీవుడ్ హీరోయిన్, చిరుత ఫేమ్ నేహా శర్మ సినిమాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, సోషల్ మీడియా ద్వారా సంపాదనలో మాత్రం…