రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రభావం కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా, పొరుగు దేశం పాకిస్థాన్లో కూడా ప్రకంపనలు పుట్టిస్తోందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా పాకిస్థాన్లోని ల్యారీ ప్రాంతంలో అక్కడి పోలీసులు భారతీయ గూఢచారుల కోసం వేట మొదలుపెట్టారని, ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేస్తున్నారని కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో నిజంగానే ‘ధురంధర్ 2’ ఎఫెక్ట్ అంతలా ఉందా అనే సందేహాలు మొదలయ్యాయి.
వైరల్ అవుతున్న ఆ వీడియోల్లో పోలీసులు రోడ్ల మీద వెళ్లే వారిని ఆపి చెక్ చేయడం, ఫుట్పాత్పై పడుకున్న వారి దుప్పట్లు తీసి మరీ ఐడెంటిటీ కార్డులు అడగడం కనిపిస్తోంది. రణవీర్ సింగ్ సినిమాలో ల్యారీ ప్రాంతంలోని గ్యాంగ్ వార్లను, గూఢచారి నెట్వర్క్ను చూపించడంతో.. ఈ సినిమా చూసి పాక్ అధికారులు అలెర్ట్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. “ధురంధర్ 2 దెబ్బకు ల్యారీ వీధుల్లో గూఢచారుల వేట” అంటూ ఈ వీడియోలు నిమిషాల్లో వేల సంఖ్యలో షేర్ అయ్యాయి. అయితే ఈ హడావిడి అంతా చూస్తుంటే నిజంగానే అక్కడ ఏదో జరుగుతోందని అనిపించడం సహజం.
కానీ ఈ వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు నిజం ఎంత అనే వివరాల్లోకి వెళితే షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలకు ‘ధురంధర్ 2’ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. ఇవి 2025 మధ్య కాలంలో కరాచీలో పోలీసులు జరిపిన సాధారణ తనిఖీలకు సంబంధించిన పాత వీడియోలు. అప్పట్లో ల్యారీలో క్రైమ్ రేటు తగ్గించడానికి పోలీసులు చేసిన రొటీన్ ఆపరేషన్ను ఇప్పుడు సినిమా స్టోరీకి ముడిపెట్టి ఎవరో కావాలని వైరల్ చేశారు. అంటే ఇదంతా కేవలం సోషల్ మీడియా సృష్టించిన ఒక భ్రమ మాత్రమే.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పాకిస్థాన్లో భారతీయ సినిమాలపై అధికారికంగా నిషేధం ఉంది. అయినప్పటికీ, లాహోర్ వంటి నగరాల్లో ‘ధురంధర్ 2’ పైరేటెడ్ వెర్షన్లను అక్కడి వారు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారట. సినిమా కథలో తమ దేశానికి వ్యతిరేక అంశాలు ఉన్నాయని తెలిసినా, రణవీర్ యాక్షన్ ఆదిత్య ధర్ టేకింగ్ కోసం పాక్ నెటిజన్లు ఈ సినిమాను వదలడం లేదని టాక్.
నిజానికి ల్యారీ ప్రాంతం దశాబ్దాలుగా గ్యాంగ్ వార్లకు నిలయంగా ఉంది. రెహమాన్ డకైత్ వంటి గ్యాంగ్స్టర్ల కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీయడంతో, అక్కడి ప్రజలు కూడా ఈ సినిమాపై స్పందిస్తున్నారు. సినిమాలోని విషయాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని ల్యారీ వాసులు విమర్శిస్తున్నప్పటికీ, ఆ సినిమా చుట్టూ జరుగుతున్న చర్చ మాత్రం ఆగడం లేదు. సినిమా ప్రభావం వల్ల కాకపోయినా, ల్యారీలో పోలీసు తనిఖీలు అనేవి అక్కడ సర్వసాధారణమైన విషయం అని మరికొందరు చెబుతున్నారు.
This post was last modified on March 24, 2026 10:32 am
భారతీయ చలనచిత్ర చరిత్రలో మొదటిసారి నాలుగు వేల కోట్లతో రూపొందుతున్న విజువల్ గ్రాండియర్ గా 'రామాయణ' గురించి నిర్మాతలు ఎంత…
కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన లేఖపై బీజేపీ ముద్ర కనిపించడం రాజకీయంగా తీవ్ర…
టాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన రచయితల్లో కోన వెంకట్ ఒకరు. డబ్బింగ్ సినిమా అయిన ‘సత్య’తో రచయితగా ప్రయాణం మొదలుపెట్టిన…
పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గం మాచర్ల. ఇక్కడ నుంచి వరుసగా విజయాలు దక్కించుకున్న పిన్నెల్లి రామకృష్నారెడ్డి ఇటీవల కాలంలో తీవ్ర…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు. ఆయన ఎలాంటి సినిమా చేసినా ఓపెనింగ్స్కు ఢోకా ఉండదు. ఫ్లాప్…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ అనదగ్గ థ్రిల్లర్లలో ఒకటైన దృశ్యం చిత్రానికి సెకండ్ సీక్వెల్ రెడీ అయిన సంగతి…