Political News

ఈసీ లేఖపై బీజేపీ ముద్ర నిజమే కానీ…

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన లేఖపై బీజేపీ ముద్ర కనిపించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అభ్యర్థుల నేర చరిత్ర వెల్లడింపు, ఎన్నికల ప్రచార నిబంధనలకు సంబంధించిన 2019 మార్గదర్శకాలపై ఈసీ ఇటీవల రాజకీయ పార్టీలకు లేఖ పంపింది.

అయితే ఆ లేఖపై బీజేపీ సీల్‌ ఉండటం వివాదానికి దారితీసింది. ఈ అంశాన్ని సీపీఎం సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేస్తూ, ఎన్నికల సంఘం తటస్థతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పటికే ఈసీ, బీజేపీ కుమ్మక్కైందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన మరిన్ని అనుమానాలకు తావిచ్చిందని విమర్శించింది. అధికారిక లేఖపై పార్టీ ముద్ర కనిపించడం సంస్థాగత నిష్పక్షపాత వైఖరిపై సందేహాలు కలిగిస్తోందని పేర్కొంది.

అయితే ఈ వివాదంపై కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యు. కెల్కర్ స్పందిస్తూ, ఇది పూర్తిగా ‘క్లరికల్ పొరపాటు’ మాత్రమేనని స్పష్టం చేశారు. 2019 మార్గదర్శకాలపై వివరణ కోరుతూ బీజేపీ కేరళ యూనిట్ సమర్పించిన పత్రంపై పార్టీ ముద్ర ఉన్నదని, అదే పత్రాన్ని పరిశీలించే సమయంలో గుర్తించకపోవడంతో పొరపాటున ఇతర పార్టీలకు పంపిణీ చేసినట్లు వివరించారు.

ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే మార్చి 21న ఆ లేఖను ఉపసంహరించుకుంటూ అధికారికంగా సవరణ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. సంబంధిత సమాచారం అన్ని రాజకీయ పార్టీలు, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు చేరవేసినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, ఇలాంటి కార్యాలయ స్థాయి పొరపాట్లను ఆధారంగా చేసుకుని తప్పుదారి పట్టించే ప్రచారం చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, కేరళలో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల రాజకీయ వేడి మరింత పెరిగింది.

This post was last modified on March 24, 2026 10:15 am

Share
Show comments
Published by
Kumar
Tags: BJP

Recent Posts

ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ మార‌బోతున్నాడా?

సూర్య‌కుమార్ యాద‌వ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎందుకు లేడు? భార‌త టీ20 జ‌ట్టు విష‌యంలో చాలా రోజులుగా అభిమానుల‌ను…

3 minutes ago

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

2 hours ago

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

8 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

9 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

10 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

11 hours ago