Political News

ఈసీ లేఖపై బీజేపీ ముద్ర నిజమే కానీ…

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన లేఖపై బీజేపీ ముద్ర కనిపించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అభ్యర్థుల నేర చరిత్ర వెల్లడింపు, ఎన్నికల ప్రచార నిబంధనలకు సంబంధించిన 2019 మార్గదర్శకాలపై ఈసీ ఇటీవల రాజకీయ పార్టీలకు లేఖ పంపింది.

అయితే ఆ లేఖపై బీజేపీ సీల్‌ ఉండటం వివాదానికి దారితీసింది. ఈ అంశాన్ని సీపీఎం సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేస్తూ, ఎన్నికల సంఘం తటస్థతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పటికే ఈసీ, బీజేపీ కుమ్మక్కైందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన మరిన్ని అనుమానాలకు తావిచ్చిందని విమర్శించింది. అధికారిక లేఖపై పార్టీ ముద్ర కనిపించడం సంస్థాగత నిష్పక్షపాత వైఖరిపై సందేహాలు కలిగిస్తోందని పేర్కొంది.

అయితే ఈ వివాదంపై కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యు. కెల్కర్ స్పందిస్తూ, ఇది పూర్తిగా ‘క్లరికల్ పొరపాటు’ మాత్రమేనని స్పష్టం చేశారు. 2019 మార్గదర్శకాలపై వివరణ కోరుతూ బీజేపీ కేరళ యూనిట్ సమర్పించిన పత్రంపై పార్టీ ముద్ర ఉన్నదని, అదే పత్రాన్ని పరిశీలించే సమయంలో గుర్తించకపోవడంతో పొరపాటున ఇతర పార్టీలకు పంపిణీ చేసినట్లు వివరించారు.

ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే మార్చి 21న ఆ లేఖను ఉపసంహరించుకుంటూ అధికారికంగా సవరణ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. సంబంధిత సమాచారం అన్ని రాజకీయ పార్టీలు, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు చేరవేసినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, ఇలాంటి కార్యాలయ స్థాయి పొరపాట్లను ఆధారంగా చేసుకుని తప్పుదారి పట్టించే ప్రచారం చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, కేరళలో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల రాజకీయ వేడి మరింత పెరిగింది.

Kumar

Recent Posts

చివరి గీతం… ‘గాన కోకిల’ జానకి ఇక లేరు

దక్షిణాది గానకోకిలగా కోట్లాది మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్న ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. ఆమె…

16 minutes ago

తెలంగాణ హంత‌కుడిది – జ‌గ‌న్‌ది ఒకే పోలిక‌: చంద్ర‌బాబు

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఓ వ్య‌క్తి ఆరుగురిని…

56 minutes ago

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

4 hours ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

4 hours ago

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…

5 hours ago

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…

6 hours ago