భారతీయ చలనచిత్ర చరిత్రలో మొదటిసారి నాలుగు వేల కోట్లతో రూపొందుతున్న విజువల్ గ్రాండియర్ గా ‘రామాయణ’ గురించి నిర్మాతలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో చూస్తున్నాం, రన్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ ఎపిక్ డ్రామాలో యష్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ముందు ప్రకటించిన దాని ప్రకారం ‘రామాయణ పార్ట్ 1’ విడుదల ఈ ఏడాది దీపావళికి జరిగిపోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ నెలలో వచ్చే తీరాలి.
కానీ ఇప్పటిదాకా రామాయణకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్లు మొదలుకాలేదు. ఇంకా ఎనిమిది నెలల సమయం ఉందని పైకి కనిపిస్తున్నప్పటికీ గ్లోబల్ లెవెల్ లో సినిమాని జనంలోకి తీసుకెళ్లాలంటే పబ్లిసిటీ ఆషామాషీగా ఉండకూడదు. 2027 ఏప్రిల్ లో వచ్చే వారణాసి కోసం రాజమౌళి ఆల్రెడీ మహేష్ బాబు టీమ్ తో విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇప్పించారు. టైటిల్ లాంచ్ గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇవన్నీ బజ్ కు ఉపయోగపడ్డాయి.
రామాయణ నుంచి అలాంటి సంకేతాలు ఏమి కనిపించడం లేదు. దర్శకుడు నితీష్ తివారి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. మార్చి 27 శ్రీరామ నవమి వస్తోంది. ఈ సందర్భంగా ఏదైనా టీజర్ లేదా ట్రైలర్ లాంటిది వదలడం సమయోచితంగా ఉంటుంది. ప్రస్తుతానికి అలాంటి అప్డేట్ ఏది ప్రొడక్షన్ హౌస్ నుంచి లేదు. రంజాన్ వల్ల ఏఆర్ రెహమాన్ అందుబాటులో లేని కారణంగా టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పని కొంత పెండింగ్ లో ఉన్నట్టు వినికిడి.
బాలీవుడ్ లో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న దురంధర్ ది రివెంజ్ రికార్డులను బద్దలుకొట్టే సత్తా రామాయణకే ఉందని ట్రేడ్ నమ్ముతోంది. దానికి తగ్గ హైప్ గ్రౌండ్ లెవెల్ లో కనిపించాలి. ఏది ఎలా ఉన్నా శ్రీరామనవమికి ఖచ్చితంగా కంటెంట్ ఇవ్వాల్సిన బాధ్యత దర్శక నిర్మాతల మీద ఉంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది స్క్రీన్లలో విడుదల ప్లాన్ చేసుకున్న రామాయణ పార్ట్ 1 ఇంత స్లోగా ఉంటే పనవ్వదు. పెద్ద రిస్కు ఉన్న బడ్జెట్ కాబట్టి దానికి అనుగుణంగానే ప్రచారాలు హోరెత్తాలి.
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…