నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి ఉంచినప్పటికీ మెయిన్ పాయింట్ ఏంటో అరటిపండు ఒలిచినట్టు అర్థమైపోయింది. నలభై వయసు దాటిన ఒక వ్యాపారవేత్తకి, చలాకీగా ఉండే ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయికి మధ్య లవ్ స్టోరీని దర్శకుడు వెంకీ అట్లూరి చాలా మెచ్యూర్డ్ గా చెప్పే ప్రయత్నం చేశారు.
నిజానికి ఇలా కథని రివీల్ చేయడానికి కారణం లేకపోలేదు. ఈ ట్విస్టుని థియేటర్ కోసం దాచి పెడితే నేరుగా చూసిన ఆడియన్స్ కి అది జీర్ణం కాకపోతే ఫలితం తేడా కొట్టొచ్చు. 1991లో యష్ చోప్రా ఈ పొరపాటు చేశారు. లమ్హేలో అనిల్ కపూర్, శ్రీదేవి జంటను రెండు షేడ్స్ లో చూపించే ప్రయత్నంలో తిరస్కారం ఎదురుకున్నారు. సబ్జెక్టు పరంగా రెండో పెళ్లికి వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉంటే పర్వాలేదు కానీ మరీ ఇరవై సంవత్సరాలంటే అంత ఈజీగా డైజెస్ట్ చేసుకునేది కాదు.
సోషల్ మీడియాలో టీజర్ మీద అన్ని రకాల రియాక్షన్లు కనిపించాయి. నెటిజెన్లు పాజిటివ్, నెగటివ్ రెండు రకాలుగా రెస్పాండ్ అయ్యారు. కానీ ఇదింకా ప్రచారంలో తొలి ఘట్టమే కాబట్టి అప్పుడే ఒక అంచనాకు రాలేం కానీ ట్రైలర్ చూశాక మరింత క్లారిటీ వస్తుంది. అసలు సూర్యకి ఇందులో మొదటి భార్య ఉందా లేక వయసు మీరినా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉన్నాడా, సూర్య మమిత ఎలా కలుసుకుంటారు లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెంకీ అట్లూరి తెలివైన గేమ్ ఆడాడు.
జూలై విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కి థియేటర్ బిజినెస్ చాలా కీలకం కానుంది. ముఖ్యంగా తెలుగు మార్కెట్ మీద పట్టు కోల్పోయిన సూర్యకు దాన్ని తిరిగి తెచ్చిచ్చే బాధ్యత నిర్మాత నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి మీద ఉంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ఇలా ఏజ్ డిఫరెన్స్ తో కథలు రాసుకునే ట్రెండ్ మొదలవ్వడం ఖాయం. అన్నట్టు వెంకీ అట్లూరి టేకింగ్ తెగ నచ్చేసిన నెట్ ఫ్లిక్స్ తనతో పెద్ద బడ్జెట్ లో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసిందట నెట్ ఫ్లిక్స్. త్వరలోనే ప్రకటన రావొచ్చు.
This post was last modified on March 17, 2026 5:52 pm
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…