ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే మేకింగ్ టైంలో అంచనాలు ఉన్నా లేకపోయినా.. రిలీజ్ టైంకి అంతా మారిపోతుంది. ఈ సినిమా విషయంలోనూ అందుకు భిన్నంగా ఏమీ జరగట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. ‘ఉస్తాద్..’కు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చూడబోతున్నామని ట్రైలర్ చూస్తే అర్థమైంది.
ఇందులో ఇద్దరు హీరోయిన్లుండగా.. వారిలో ఎవరు హైలైట్ అవుతారన్నది ఆసక్తికరం. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లు పేరుకే ఉంటారు. కొన్ని రొమాంటిక్, కామెడీ సీన్లలో కనిపించి.. పాటల్లో స్టెప్పులేసి వెళ్లిపోతుంటారు. ట్రైలర్లో శ్రీలీల, రాశి ఇద్దరూ కూడా పెద్దగా హైలైట్ అవ్వలేదు. ఐతే ట్రైలర్ను బట్టి చూస్తే.. శ్రీలీలనే మెయిన్ హీరోయిన్, రాశి సెకండ్ హీరోయిన్ అని అర్థమవుతోంది. ఆమె పాత్ర నిడివి కూడా తక్కువేనట.
ఐతే మొన్నటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం పూర్తిగా రాశిదే డామినేషన్ అయింది. అందుకు తన స్టైలింగే కారణం. సూపర్ హాట్గా తయారై వచ్చిన ఆమె.. కుర్రాళ్ల దృష్టిని పూర్తిగా తన వైపు తిప్పేసుకుంది. పాతతరం హీరోయిన్లలా తయారై వచ్చిన శ్రీలీల.. రాశి ముందు ముందు నిలవలేకపోయింది. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా రాశి ఫొటోలే కనిపిస్తున్నాయి. అంతగా తన గ్లామర్ హైలైట్ అయింది. సినిమాలో కూడా రాశి కనిపించినంత సేపు గ్లామర్ విందు చేయబోతోందని అర్థమవుతోంది. ‘ఎత్తరా కాలర్’ పాటకు సంబంధించిన ప్రోమోలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.
శ్రీలీల ఎప్పుడూ కొంచెం ట్రెడిషనల్ లుక్స్లోనే కనిపిస్తూ ఉంటుంది. నార్త్ హీరోయిన్ల మాదిరి గ్లామర్ విందు చేయదు. రాశికి అలాంటి మొహమాటాలేమీ లేవు. మరి సినిమాలో లీడ్ హీరోయిన్ అయినప్పటికీ శ్రీలీల.. రాశిని డామినేట్ చేయగలదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సందేహాలకు ఇంకో రెండు రోజుల్లో సమాధానం తెలిసిపోతుంది.
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…